News October 20, 2025
HYD: రేపు దీపక్రెడ్డి నామిషన్ ర్యాలీకీ ప్రముఖులు

జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. యూసఫ్గూడ హైలంకాలనీ నుంచి షేక్పేట్ తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ హాజరుకానున్నట్టు ధ్రువీకరించగా, అస్సాం, మహారాష్ట్ర సీఎంల కన్ఫర్మేషన్ కోసం టీబీజేపీ వెయిటింగ్.
Similar News
News October 20, 2025
దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ PM.. నెటిజన్ల ఫైర్

ప్రపంచంలోని హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ పండుగ చీకటిని పారదోలి, సామరస్యాన్ని పెంపొందించి, శాంతి, కరుణ, శ్రేయస్సు వైపు మనల్ని నడిపించాలని పేర్కొన్నారు. కాగా పహల్గాంలో హిందువులను చంపి ఇప్పుడు విషెస్ చెబుతారా అంటూ భారత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాక్లో హిందువులు, సిక్కులను ఒక పద్ధతి ప్రకారం చంపారని మండిపడుతున్నారు.
News October 20, 2025
ఏలూరు: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

ఏలూరులో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వట్లూరు సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతిదేహం పడి ఉండడంతో స్థానికులు జీఆర్పీలకు సమచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టానికి ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. రైల్వే HC శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 20, 2025
మీకు తెలుసా? దేవతల పుత్రుడే ‘నరకాసురుడు’

కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడ్ని చంపి, వెలుగు నింపినందుకు గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. అయితే ఆ నరకాసురుడు దేవతల పుత్రుడే అని మీకు తెలుసా? విష్ణుమూర్తి వరాహ అవతారానికి, భూదేవికి జన్మించిన కుమారుడే ఈ అసురుడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన ఇతను దుష్ట స్వభావాన్ని పెంచుకుని అసురుడిగా మారాడు. అహంకారం పెరిగి 16K రాజకుమార్తెలను బంధించాడు. తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేత మరణం లేని వరం ఉండేది.