News July 4, 2024

HYD: రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్ వద్ద అదనంగా వసూలు

image

HYD నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద క్లాక్ రూమ్‌లో వసూళ్లపై SCR ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదులు చేశారు. బెంగళూరు ప్రాంతానికి చెందిన అవినాశ్ అనే వ్యక్తి నుంచి క్లాక్ రూమ్ వద్ద ఒక బ్యాగుకి 24 గంటలకి రూ.20 వసూలు చేయాల్సి ఉండగా రూ.40 వసూలు చేశారని, ఇలా వందలాది మంది నుంచి అదనంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిల్ కండిషన్లలోనూ 24 గంటలకు రూ.20 వసూలు చేయాలని ఉందని చూపించారు.

Similar News

News October 3, 2024

HYD: KCR.. వాళ్లని కంట్రోల్ చేయ్: MP

image

HYD ప్రజల క్షేమం, భద్రత కోసమే హైడ్రా, మూసీ ఆపరేషన్లు స్టార్ట్ చేశామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తమ ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొడుతోందని KTR, హరీశ్ రావు ఆరోపణలు అర్థరాహిత్యమని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే HYD అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న KTR, హరీశ్ రావును KCR కంట్రోల్ చేయాలని, రాష్ట్ర భవిష్యత్తును వీళ్లు అడ్డుకుంటున్నారన్నారు.

News October 3, 2024

సికింద్రాబాద్: సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆమ్రపాలి

image

సికిందరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో సిఖ్ గ్రౌండ్‌లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు ఏర్పాట్లను GHMC కమిషనర్ ఆమ్రపాలి కాటా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను
కమిషనర్ ఆదేశించారు. సీఎం పర్యటన నిన్న రాత్రి ఖరారు కావడంతో అధికారులను అప్రమత్తం చేసి ఏర్పాట్లను ఎప్పటికి అప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

News October 3, 2024

HYD: IT వైపే అందరి మొగ్గు.. కోర్ బ్రాంచీల కష్టాలు..!

image

యువత IT వైపే మొగ్గు చూపుతున్నారు. కోర్ బ్రాంచీలకు కష్టాలు ఏర్పడుతున్న తరుణంలో ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ అభ్యసించిన వారికి ప్రత్యేక స్కాలర్షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. రాజధాని HYDలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో IT, CSE బ్రాంచుల్లో 99% సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి.అదే కోర్ బ్రాంచీల్లో అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.