News March 26, 2025

HYD: రైళ్లలో హై అలర్ట్.. ఎక్కడికక్కడ పోలీసులు!

image

MMTS రైలులో జరిగిన ఘటనతో సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అప్రమత్తమైంది. HYD, సికింద్రాబాద్ సహా SCR పరిధిలో నడిచే అన్ని రైళ్లలో ఎక్కడికక్కడ పోలీసుల తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రతపై ఫోకస్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

Similar News

News November 10, 2025

వేములవాడ: రాజన్న కళ్యాణం.. అరకొర టికెట్లతో నిరాశలో భక్తులు

image

వేములవాడ రాజన్న నిత్యకళ్యాణం టికెట్ల విషయంలో భక్తులు నిరాశకు లోనవుతున్నారు. గతంలో విశాల కళాభవనంలో భక్తులు నిత్యకళ్యాణం మొక్కులు చెల్లించేవారు. ఆలయ విస్తరణ నేపథ్యంలో భీమేశ్వరాలయం ఎదురుగా ఉన్న నిత్యఅన్నదాన సత్రం పైఅంతస్తులో ఈ క్రతువును జరిపిస్తున్నారు. గతంలో 150 జంటలకు టికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని 90కి తగ్గించేశారు. టికెట్లు తీసుకునే సమయంలో ఇక్కడ తోపులాట సైతం జరుగుతుందని పలువురు పేర్కొన్నారు.

News November 10, 2025

రీఓపెన్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రీఓపెన్ అయిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 192 విజ్ఞప్తులను స్వీకరించినట్లు తెలిపారు. రీ ఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

News November 10, 2025

NGKL: ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

image

NGKL కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 51 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పెండింగ్‌లో పెట్టకుండా, వెంటనే పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బధావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే అన్ని శాఖల అధికారులు వాటిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.