News October 28, 2025
HYD: రోగికి సేవల పేరిట మహిళను ఏపీకి తరలింపు!

రోగికి సేవచేయడానికెళ్లిన మహిళ తిరిగిరాని ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. హనుమాన్నగర్ గార్డెన్-IIలో బంకా హేమేశ్వరి(45) ఉంటుంది. OCT 25న ఉద్యోగానికెళ్తున్నట్లు కూతరు జయశ్రీ(22)కి తెలిపింది. సా.7:30కి తల్లి ఫోన్ కలవలేదు. 26న ఉ.9కి ఫోన్ చేస్తే రోగి కుటుంబం విజయవాడకు తీసుకెళ్లిందని చెప్పింది. రా.11కు మరోకూతురు తేజస్వికి వీడియో కాల్లో రోగిని చూపిస్తూ ఏడుస్తూ కాల్ కట్ చేసిందని PSలో ఫిర్యాదు చేసింది.
Similar News
News October 28, 2025
జూబ్లీ బైపోల్: మంత్రులకు డివిజన్ల బాధ్యతలు

జూబ్లీహిల్స్ బైపోల్లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. రహమత్నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్కు ప్రచార బాధ్యతలు అప్పగించారు.
News October 28, 2025
క్యాబిన్ క్రూ జాహ్నవి గుప్తా ఆత్మహత్య

రాజేంద్రనగర్ పరిధిలో ఇండిగో ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న జాహ్నవి గుప్తా ఆత్మహత్య చేసుకుంది. జమ్మూకు చెందిన జాహ్నవి, ఇటీవల ఇండిగో క్యాప్టెన్, స్నేహితుడితో కలిసి పార్టీకి హాజరై, అనంతరం తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించడం లేదు.
News October 28, 2025
HYD: ఓపెన్ యూనివర్సిటీలో నవంబర్ 13 వరకు అవకాశం

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019-24 డిగ్రీ(BA/B.COM/BSC) విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు NOV 13 వరకు అవకాశం ఉందని విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డా.Y.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. 2022-2024లో PG (MA/ M.COM/ MSC) అడ్మిషన్ పొందిన విద్యార్థులు కూడా ద్వితీయ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం www.braouonline.inను సందర్శించాలని ఆయన సూచించారు.


