News September 24, 2025
HYD: ర్యాగింగ్ భూతం.. ఈనంబర్లు సేవ్ చేసుకోండి

ర్యాగింగ్ భూతానికి ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం నగరంలో చర్చనీయాంశమైంది. బీటెక్ విద్యార్థి ఇలా ప్రాణం తీసుకోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనపై విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ట్రై కమిషనరేట్ పరిధిలోని విద్యార్థులు 100, 040-23286966, 8712681251, 040-27853418, 9490617100, 040-27852333, 8712661000, 040-27853030, 8712662666 నంబర్లకు ఫోన్ చేసి సాహాయం పొందవచ్చని సూచించారు.
Similar News
News September 24, 2025
మైలార్దేవ్పల్లిలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

మైలార్దేవ్పల్లి పోలీసులు సుపారీ గ్యాంగ్ను అరెస్టు చేశారు. రూ. 9 లక్షలకు ఇమ్రాన్ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులు సుపారీ తీసుకున్నారు. గత వ్యాపార వివాదాల కారణంగా షేక్ అమీర్, మహమ్మద్ సోయల్ ఈ సుపారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కత్తులు, సెల్ఫోన్లు, వాహనాలు, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.
News September 24, 2025
హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు

నాలాల ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు అందాయి. నాలాల కబ్జా కారణంగా వర్షం నీరు ఇళ్లలోకి చేరుతోందని ఫిర్యాదు చేశారు. చెరువులను కలిపే నాలాలు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్లడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. చెరువులను అనుసంధానం చేస్తూ సాగే నాలాలు కబ్జాలకు గురి కావడంతో వరద నేరుగా చెరువుకు వెళ్లకుండా కాలనీల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
News September 24, 2025
సైబరాబాద్ కమిషనరేట్లో పోలీసులకు మెడల్స్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో 122 పోలీస్ సిబ్బందికి సేవా పథకం మెడల్స్ అందజేశారు. ఈ అవార్డుల్లో 35 మెడల్స్ కొత్త సంవత్సరం, 87 మెడల్స్ తెలంగాణ స్థాపన దినోత్సవం సందర్భంగా ఇచ్చారు. సైబరాబాద్ CP అవినాష్ మోహంతి అవార్డులను అందజేసి అభినందించారు. ఈ అవార్డులు సిబ్బందికి కృషి, ప్రజా భద్రతలో అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. జాయింట్ CP ట్రాఫిక్, ADCPs, ACPs, ఇన్స్పెక్టర్లు ఉన్నారు.