News May 2, 2024
HYD: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కోర్ట్ ఉద్యోగులు

HYD సిటీ సివిల్ కోర్టులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోర్టులో పనిచేసే ఉద్యోగులు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బెయిల్కు సంబంధించిన పేపర్లు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2026
HYD: బుక్స్ను గౌరవిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం!

పరీక్షలు ముగిసిన తర్వాత పుస్తకాలను చింపి రోడ్లపై వేయకుండా, విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలని HYDలోని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. పుస్తకాలు జ్ఞానానికి ప్రతీకలని, సరస్వతి దేవతతో సమామానంగా కొలిచే వాటిని అగౌరపరచొద్దని, అవసరమైనవారికి అందించాలని గుర్తు చేస్తున్నారు. రోడ్లపై పేపర్లు వేస్తే పారిశుద్ధ్య కార్మికులపై భారం పడుతుందని, నగరాన్ని నీట్గా ఉంచడంలో అందరూ సహకరించాలన్నారు.
News February 25, 2026
HYD: నలుపెక్కిన నగరం.. వర్ష సూచన

HYDలో ఒక్కసారిగా వాతావారణం మారిపోయింది. ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలను నల్లని మబ్బులు కమ్మేయగా, చల్లని గాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కొన్ని చోట్ల ఎండగా ఉన్నప్పటికీ ప్రయాణాలను పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. మీ ఏరియాలో వర్షం పడుతుందా?
News February 25, 2026
HYD: 21 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నగరంలోని గాంధీ, పేట్లబుర్జూ, కోఠి ప్రసూతి ఆస్పత్రి వైద్యులతో సహా 21 మంది ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.


