News October 18, 2025
HYD: లక్షకు పైగా మొబైల్స్ రికవరీ: సీఐడీ

తెలంగాణ సైబర్ క్రైమ్, సీఐడీ మరో రికార్డ్ సృష్టించింది. దొంగిలించబడిన, పోయిన మొబైల్స్ రికవరీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 1,00,020 మొబైల్స్ రికవరీ చేసి జాతీయ స్థాయిలో బెంచ్ మార్క్ సెట్ చేసింది. దేశంలోని పైలట్ ప్రాజెక్టుల కంటే ఆలస్యంగా ప్రారంభమైనా, తెలంగాణ సీఈఐఆర్ సిస్టమ్ అద్భుత ఫలితాలు సాధించింది.
Similar News
News October 18, 2025
HYD: ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద BRS నేతల నిరసన

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగిన బీసీ బంద్ ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవం కోసం పోరాటం కొనసాగుతుందని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
News October 18, 2025
HYD: ఆటోవాలాకు ‘దీపావళి పండుగ’

బీసీల 42% రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో అన్ని పార్టీలు ఏకకంఠంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి. బస్టాప్లు ఆటోలతో కిక్కిరిశాయి. పాఠశాలలు మూతపడి, ఉద్యోగాలు కొనసాగడంతో ఆటోల డిమాండ్ ఆకాశాన్నంటింది. ప్రయాణికులు డబుల్ ఛార్జీకి ఒప్పుకోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా పడిన ఈ అదృష్టంతో ఆటోవాలకు ముందుగానే ‘దీపావళి’ వెలుగొచ్చిందని సంబరపడుతున్నారు.
News October 18, 2025
HYD: బాలికపై అత్యాచారం.. ట్యూషన్ టీచర్కు పదేళ్ల జైలు శిక్ష

విద్యార్థినిపై అత్యాచార ఘటనలో ట్యూషన్ టీచర్కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ HYD రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఆంజనేయులు తీర్పునిచ్చారు. బాలిక(12) నివసించే ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వరరావు దగ్గర రోజు ట్యూషన్కి వెళ్లేది. 2017 డిసెంబర్ 3న బాలికపై ట్యూషన్ అయిపోయాక గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు పూర్తి ఆధారాలు సమర్పించడంతో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు.