News July 5, 2025

HYD: లక్షల టన్నుల మామిడి.. రూ.3 కోట్ల ఆదాయం.!

image

HYD నగర శివారు రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారం మార్కెట్లో ఈ సారి రికార్డు స్థాయిలో మామిడి వచ్చింది. ఇప్పటి వరకు ఈ ఏడాది సుమారు 1.43 లక్షల టన్నుల మామిడి రాకపోకలు సాగగా మొత్తం సుమారుగా సుమారు రూ.3 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర ప్రాంతాల్లో డిమాండ్ తక్కువగా ఉండడంతో, బాటసింగారానికి భారీగా తరలివచ్చింది.

Similar News

News July 5, 2025

కోహెడ: ‘గురుకుల మైదానంలో మొక్కలు నాటాలి’

image

గురుకుల మైదానంలో మొక్కలు నాటాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు. కోహెడ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనికి చేశారు. రిజిస్టర్ వెరిఫై చేసిన అనంతరం పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

News July 5, 2025

ఏలూరు: ప్రమాద బీమా కేసులో రూ.85 లక్షల పరిహారం

image

ఏలూరు కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ.. కక్షి దారులకు త్వరితగతిన కేసులు పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 35 బెంచీలను ఏర్పాటు చేసి కేసుల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. వాహన ప్రమాద బీయా కేసులో రూ.85 లక్షలు పరిహారాన్ని చెల్లించామన్నారు.

News July 5, 2025

గంజాయిని రూపుమాపేందుకు కృషి: సూర్యాపేట ఎస్పీ

image

గంజాయిని రూపుమాపేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని SRPT జిల్లా SP నరసింహ అన్నారు. శనివారం కోదాడ మండలం దొరకుంట శివారులో గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన నిందితులు అడప రాకేశ్, వనపర్తి సాయిలును మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడారు. వీరి వద్ద నుంచి రూ.2.8 లక్షల విలువైన 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులను పట్టుకున్న సీఐ రజిత రెడ్డి, రూరల్ పోలీసులను SP అభినందించారు.