News September 12, 2025
HYD: వాట్సాప్లో ఎఫ్ఐఆర్ నమోదు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదుదారులకు ఎఫ్ఐఆర్ను వాట్సాప్లో పంపించే సరికొత్త విధానానికి సీపీ అవినాష్ మహంతి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ను నమోదు చేసి బాధితుడికి వాట్సాప్లో పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో పోలీసు సేవలు పారదర్శకంగా ఉండటంతో పాటు, ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News September 12, 2025
విశాఖలో ఈ-గవర్నెన్స్పై జాతీయ సదస్సు: కలెక్టర్

విశాఖలో సెప్టెంబర్ 22, 23వ తేదీల్లో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు జరగనుంది. వికసిత్ భారత్, సివిల్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరిట రెండు రోజుల నోవాటెల్ హాటళ్లో నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి 1000 మంది అతిథులు, ఏపీ సీఎం, కేంద్ర, రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు భాగస్వామ్యం కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం ఆదేశించారు.
News September 12, 2025
స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు ఏమైనా చేస్తాం: బొత్స

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు తాము దేనికైనా సిద్ధమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా నిలిచిపోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. 32 విభాగాలను ఔట్సోర్సింగ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఉద్ధరిస్తున్నట్లు చూపుతున్నారు’ అని బొత్స మండిపడ్డారు.
News September 12, 2025
జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్గా రాజా గౌడ్

జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్)గా రాజా గౌడ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను అడిషనల్ కలెక్టర్ను నియమించినట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు రాజా గౌడ్ విధుల్లో చేరనున్నారు.