News February 18, 2025
HYD: వాదిస్తూ.. కుప్పకూలిన సీనియర్ లాయర్

హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్కు గుండెపోటు వచ్చింది. హైకోర్టులో వాదిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టులో అన్ని బెంచ్లలో విచారణ నిలిపేశారు. అన్ని కోర్టులో విచారణలు రేపటికి వాయిదా వేశారు.
Similar News
News February 20, 2025
MCA పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంసీఏ పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 21వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో చెల్లించవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.
News February 20, 2025
OU డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ తదితర కోర్సుల మొదటి, మూడు, అయిదో సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
News February 20, 2025
తమిళనాడు మంత్రికి స్వాగతం పలికిన TG మంత్రి

తమిళనాడు హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్కి వచ్చిన తమిళనాడు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ శాఖ మంత్రి తిరు ఆర్.గాంధీని HYD ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకి మంత్రి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి కీలక విషయాలపై చర్చించారు.