News October 14, 2024
HYD: విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఈటల
సికింద్రాబాద్లో <<14353764>>ముత్యాలమ్మ విగ్రహాన్ని<<>> ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BJP మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. దాడిచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే జరిగే పరిణామాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Similar News
News October 14, 2024
HYD: రాడార్ ఏర్పాటుకు BRS వ్యతిరేకం: KTR
ఓ వైపు మూసీ నదికి CM మరణశాసనం రాస్తూ.. మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. 10 ఏళ్ల పాలనలో తమపై రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదని, జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్ను తెలంగాణలో ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.
News October 14, 2024
HYD: దుర్గాదేవి లడ్డూ వేలం.. @ రూ.5,02,116
సాధారణంగా గణేశ్ లడ్డూ వేలం మీరు వినే ఉంటారు.. కానీ ఆ గ్రామంలో దుర్గాదేవి లడ్డూ వేలం నిర్వహించారు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. RR జిల్లా మాడుగులలో అమ్మవారి విగ్రహం వద్ద లడ్డూ ప్రసాదం పెట్టి, నవరాత్రులు పూజలు చేశారు. అనంతరం ఆదివారం వేలం వేయగా స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి సూదిని నారాయణ్ రెడ్డి రూ.5,02,116కు లడ్డూను దక్కించుకున్నారు. చీరలు, ముక్కుపుడక ఇలా అన్నింటి వేలం పాటతో మొత్తం రూ.10,85,000 వచ్చాయి.
News October 14, 2024
మల్కాజిగిరి రైల్వే స్టేషన్కు కొత్త రూపురేఖలు
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS)లో భాగంగా చేపట్టిన మల్కాజిగిరి రైల్వే స్టేషన్ పునరభివృద్ధి శరవేగంగా సాగుతోంది. వచ్చే ఆరు నెలల్లో పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. భారతీయ రైల్వే ద్వారా పునరుద్ధరణ, పునరాభివృద్ధి కోసం భారతదేశం అంతటా 1,275 స్టేషన్లు షార్ట్లిస్ట్ చేయబడ్డాయి. అందులో మల్కాజిగిరి రైల్వేస్టేషన్ను ఎంపిక చేసి అభివృద్ధి పనులకు రూ.27 కోట్లు కేటాయించారు.