News August 26, 2025

HYD: వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలంటే!

image

వినాయక చవితి ఏ రోజు నిర్వహించుకోవాలనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈ నెల 22, 23 రెండు రోజులు అమావాస్య రావడంతో చవితి ఏ రోజు అనేది అర్థం కావడం లేదు. దీంతో భాద్రపద శుక్ల చవితి ఈ నెల 27న అని, ఆ రోజే వినాయక చవితి జరుపుకోవాలని షాద్‌నగర్‌లోని వేద పండితులు క్లారిటీ ఇచ్చారు. వినాయక పూజ చేసుకోవడానికి ఉ.11:05 నుంచి మ.1:40 వరకు మంచి ముహూర్తం అన్నారు. నిమజ్జనం సెప్టెంబర్ 6న చేయాలన్నారు.

Similar News

News August 26, 2025

ఉత్సవాలకు ముందే.. HYDలో తొలి విగ్రహం నిమజ్జనం

image

వినాయక ఉత్సవాలు ప్రారంభం కాకముందే హుస్సేన్‌సాగర్‌‌లో నిమజ్జనం జరిగింది. దోమల్‌గూడకు చెందిన మండప నిర్వాహకులు వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి సోమవారం మండపానికి తరలిస్తుండగా హిమాయత్‌‌నగర్‌‌లో కేబుల్స్‌కు తగిలి కింద పడిపోయింది. ఈ ఘటనలో విగ్రహం కొంత ధ్వంసం అయింది. దీంతో నిర్వాహకులు ఆ విగ్రహాన్ని పీపుల్స్‌ప్లాజా వద్ద క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు.

News August 26, 2025

HYD: క్రిమినల్ కావాలనే సహస్ర మర్డర్

image

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో విచారణ వేగం పుంజుకుంటోంది. నిందితుడైన బాలుడిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నట్టు సమాచారం. క్రిమినల్ కావాలనే లక్ష్యంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన్నట్లు దర్యాప్తులో బయటపడింది. బాలుడి ఫోన్‌లో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతడి వద్ద లభించిన లెటర్‌తో సహస్ర హత్యకు సంబంధం లేదని విచారణలో తేలింది.

News August 26, 2025

HYD: క్రిమినల్ కావాలనే సహస్ర మర్డర్

image

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో విచారణ వేగం పుంజుకుంటోంది. నిందితుడైన బాలుడిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నట్టు సమాచారం. క్రిమినల్ కావాలనే లక్ష్యంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన్నట్లు దర్యాప్తులో బయటపడింది. బాలుడి ఫోన్‌లో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతడి వద్ద లభించిన లెటర్‌తో సహస్ర హత్యకు సంబంధం లేదని విచారణలో తేలింది.