News August 26, 2025
HYD: వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలంటే!

వినాయక చవితి ఏ రోజు నిర్వహించుకోవాలనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈ నెల 22, 23 రెండు రోజులు అమావాస్య రావడంతో చవితి ఏ రోజు అనేది అర్థం కావడం లేదు. దీంతో భాద్రపద శుక్ల చవితి ఈ నెల 27న అని, ఆ రోజే వినాయక చవితి జరుపుకోవాలని షాద్నగర్లోని వేద పండితులు క్లారిటీ ఇచ్చారు. వినాయక పూజ చేసుకోవడానికి ఉ.11:05 నుంచి మ.1:40 వరకు మంచి ముహూర్తం అన్నారు. నిమజ్జనం సెప్టెంబర్ 6న చేయాలన్నారు.
Similar News
News August 26, 2025
HYD: క్రిమినల్ కావాలనే సహస్ర మర్డర్

కూకట్పల్లిలో సహస్ర హత్య కేసులో విచారణ వేగం పుంజుకుంటోంది. నిందితుడైన బాలుడిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నట్టు సమాచారం. క్రిమినల్ కావాలనే లక్ష్యంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన్నట్లు దర్యాప్తులో బయటపడింది. బాలుడి ఫోన్లో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్లు అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతడి వద్ద లభించిన లెటర్తో సహస్ర హత్యకు సంబంధం లేదని విచారణలో తేలింది.
News August 26, 2025
HYD: పరారీలోనే మహేందర్ రెడ్డి కుటుంబం

స్వాతి హత్య కేసులో నిందితుడైన మహేందర్ రెడ్డి కుటుంబం ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వాతి హత్య విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వారు ఊరు విడిచి వెళ్లి పోయారని గ్రామస్థులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే మృతదేహం విడిభాగాలు దొరకకపోవడంతో మొండానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
News August 26, 2025
HYD: హత్య చేసి తాపిగా వెళ్లి సిగరెట్ తాగాడు!

HYDలో సంచలనం రేపిన స్వాతి హత్య కేసులో కిరాతకుడు మహేందర్రెడ్డి చేసిన పనులు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లైన నెల నుంచే అనుమానం, పంచాయతీలు పెట్టి ఊరందరి ముందు పరువు తీసిందన్న కక్షతో భార్య స్వాతిని చంపి ముక్కలు చేశాడు. అనంతరం ఇంటి దగ్గర పాన్షాప్కు వెళ్లి ఏమీ జరగనట్లు తాపీగా సిగరెట్ తాగాడని పోలీసులు విచారణలో తేలింది. ఈ పైశాచిక భర్త ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్నాడు.