News March 30, 2025
HYD: వెల వెలబోతున్న మాంసం షాపులు!

మాంసం దుకాణాలపై ఉగాది పండుగ ప్రభావం చూపుతోంది. నగరశివారు మూడుచింతలపల్లిలో చికెన్, మటన్ దుకాణాలు కస్టమర్లు లేక వెలవెల బోయాయి. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు చికెన్, మటన్ షాపుల వద్దకు బారులు తీరుతారు. కానీ, ఈ ఆదివారం తెలుగు నూతన సంవత్సరం కావడంతో ప్రజలందరూ ఆలయాల దర్శనాలు, పంచాంగ శ్రవణం చేస్తున్నారు. దీంతో నాన్ వెజ్కు దూరంగా ఉంటున్నారు. గిరాకీ లేదని మాంసం వ్యాపారులు చెబుతున్నారు.
Similar News
News April 1, 2025
HYD: కారులో జర్మనీ యువతితో అసభ్య ప్రవర్తన

మీర్పేటలో కలకలం రేగింది. తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో జర్మనీకి చెందిన యువతి మందమల్లమ్మ వద్ద కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తి పహాడిషరీఫ్ ప్రాంతంలో ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు తప్పించుకొని పారిపోయింది. మీర్పేట PSలో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసి పహాడీషరీఫ్ పోలీసులకు బదిలీచేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 1, 2025
HYD ఊపిరి ఆగుతుందని స్లోగన్స్

HCUలో ప్రభుత్వ దమనకాండ అంటూ KBR పార్కు దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది. HCU అడవిని నరికితే.. హైదరాబాద్ ఊపిరి ఆగుతుంది’ అంటూ బీఆర్ఎస్వీ నాయకులు నినాదాలు చేశారు. ఈ నిరసనకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకృతి ప్రేమికులు, మద్దతు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News April 1, 2025
HYD: ఏప్రిల్ 3న కొత్త ఎక్సైజ్ స్టేషన్స్ ప్రారంభం

HYD: కొత్త ఎక్సైజ్ స్టేషన్లు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. గండిపేట, అమీన్పూర్ ఎక్సైజ్ స్టేషను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. హైదరాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్లో 13 వరంగల్ రూరల్లో ఒక కొత్త ఎక్సైజ్ స్టేషన్లను ఏప్రిల్ 1న బదులు ఏప్రిల్ 3న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3న కొత్త స్టేషన్లు ప్రారంభించడానికి రాష్ట్ర ఎక్సైజ్ నిర్ణయం తీసుకుంది.