News August 28, 2025

HYD: వెస్ట్ జోన్‌లో 1,638 గణపయ్య విగ్రహాలు

image

సిటీ వెస్ట్ జోన్ పరధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 1,638 మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించారు. బంజారాహిల్స్ PS పరిధిలో 274, బోరబండ పరిధిలో 268, మాసబ్‌ట్యాంక్ పరిధిలో 44, ఎస్ఆర్‌నగర్ లిమిట్స్‌లో 239, పంజగుట్ట పరిధిలో 185, ఫిలింనగర్‌లో 215, మధురానగర్‌లో 287, జూబ్లీహిల్స్ PS పరిధిలో 126 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 278 మంది పోలీసులను భద్రత కోసం కేటాయించారు.

Similar News

News September 11, 2025

HYD నుంచి హైస్పీడ్ రైళ్లు!

image

HYD నుంచి చెన్నయ్, బెంగళూరు, అమరావతికి వెళ్లాలంటే గంటల కొద్దీ ప్రయాణం చేయాలి. భవిష్యత్తులో ఈ బాధలు తప్పనున్నాయి. సిటీ నుంచి చెన్నయ్, బెంగళూరు, అమరావతికి హైస్పీడ్ రైళ్లు త్వరలో రానున్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే చెన్నయ్, బెంగళూరు లైన్లు ఓకే కాగా.. ఇప్పుడు అమరావతి రూట్ మ్యాప్ క్లియర్ అయిందని తెలిసింది. అన్నీ అనుకూలిస్తే ఆ సిటీలకు ఇక రయ్..రయ్..మంటూ వెళ్లడమే.

News September 11, 2025

బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్.. దేశంలో సిటీ టాప్

image

దేశంలో రోజురోజుకూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరంలో ప్రతి లక్ష మంది మహిళల్లో దాదాపు 54 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్) నివేదిక పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. అధిక రొమ్ము క్యాన్సర్ బాధిత మహిళల నగరాల్లో బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం సిటీలు తరువాత స్థానాల్లో నిలిచాయని ఐసీఎంఆర్ పేర్కొంది.

News September 11, 2025

HYD: దసరా, దీపావళి.. స్టేషన్లలో బందోబస్తు

image

దసరా, దీపావళి సందర్భంగా లక్షలాది మంది సొంతూళ్లకు వెళతారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి,చర్లపల్లి రైల్వే స్టేషన్ల వద్ద భద్రతా చర్యలు పటిష్టం చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ‘వెయిటింగ్ హాల్, ప్లాట్ ఫాం వద్ద నిరంతర తనిఖీలు చేయాలి. ప్రయాణికులను క్యూ లైన్లలో రైళ్లలోకి పంపించాలి. ఎంట్రీ పాయింట్ల వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి’’ అని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.