News February 12, 2025
HYD: వేధింపులు.. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని మృతి (UPDATE)

ఫీజు కట్టాలని వేధింపులు తాళలేక మేడ్చల్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అఖిల మంగళవారం ఉదయం ఆత్మహత్యకు యత్నించగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం అఖిల చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఇదే విషయమై పలువురు పాఠశాల యాజమాన్యం వైఖరిపై మండిపడుతున్నారు.
Similar News
News September 18, 2025
గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.
News September 18, 2025
మత్స్యకార కుటుంబాలకు పరిహారం: ఎంపీ తంగెళ్ల

చేపల వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కాకినాడలో ఆయన మాట్లాడారు. ఏడేళ్లలో జిల్లాలో 18 మంది మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణించారని చెప్పారు. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా వారికి తక్షణమే పరిహారం విడుదల చేయాలని అధికారులను కోరారు.
News September 18, 2025
గుంటూరులో డయేరియా కేసులు

గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన ఆహారం, నీటి వల్ల వాంతులు, విరోచనాలు పెరిగాయని వైద్యులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 35 మంది అతిసార లక్షణాలతో జీజీహెచ్లో చేరారు. అతిసార రోగులకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపారు.