News November 1, 2025
HYD: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపుల కలకలం

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు బాంబు బెదిరింపు ఈ మెయిల్ కలకలం రేపింది. ఇండిగో ఫ్లైట్-68 ల్యాండింగ్ ఆపాలని హెచ్చరిక అందడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. విమానంలో IED, నర్వ్ గ్యాస్ ఉండొచ్చని అనుమానంపై BTAC అత్యవసర సమావేశం జరిగింది. ఫ్లైట్ను ముంబై ఎయిర్పోర్టుకు మళ్లించే నిర్ణయం తీసుకున్నారు. GMR సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, భద్రతా విభాగాలు మెయిల్ను పరిశీలిస్తున్నాయి.
Similar News
News November 1, 2025
కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో 10మంది భక్తులు మృతి చెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం దురదృష్టకరమని Dy.CM పవన్ ట్వీట్ చేశారు.
News November 1, 2025
జగిత్యాల: ‘ఎవరైన చావాలా సార్..?’

మల్యాలలో <<18168200>>నేడు రోడ్డుప్రమాదం<<>> జరిగిన సంగతి తెలిసిందే. కాగా రోడ్డుకిరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై OCT 17న ‘రోడ్డును కమ్మేసిన పిచ్చిమొక్కలు’ శీర్షికన Way2Newsలో వార్త ప్రచురితమైంది. అయినా అధికారులు మాకేం పట్టింపన్నట్లుగా ఉండటంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ‘ఎవరైన చావాలా’ అని అడుగుతున్నారు.
News November 1, 2025
HYD: KCR పదేళ్లు దోచుకున్నాడు: జేఏసీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు. శనివారం HYD బషీర్బాగ్లో జాక్ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందన్నారు. KCR 10ఏళ్లలో దోపిడీ, నిరంకుశ పాలనను సాగించారని, BRSను ఓడించాలని ప్రజలను కోరారు.


