News April 28, 2024
HYD శివారులో చిరుత పులి.. మాటేసిన సిబ్బంది

హైదరాబాద్ శివారు శంషాబాద్లో చిరుతపులి సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్పోర్ట్ అధికారులు ఫిర్యాదు మేరకు రన్వేతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుత, మరో రెండు పిల్లలను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలను బిగించారు.
Similar News
News December 31, 2025
HYD: రాత్రి 7 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లో కఠిన భద్రతా చర్యలు అమల్లోకి వచ్చాయి. ఈవెంట్లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని CP సజ్జనార్ స్పష్టం చేశారు. రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు తప్పదని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతతో కొత్త ఏడాదిని జరుపుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
News December 31, 2025
31st నైట్ HYDలో ఈ రూట్లు బంద్

New Year వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈరోజు రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, PV మార్గ్, పలు ఫ్లైఓవర్లను పూర్తిగా నిలిపివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
News December 31, 2025
HYD: ఈ చేపలు తింటే ముప్పు

మేడ్చల్ (D) ఎదులాబాద్ నీటి రిజర్వాయర్ కాలుష్యంతో తీవ్రంగా కలుషితమవుతోంది. ఇందులోని చేపలు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. తక్కువ ధర, అధిక ప్రోటీన్ అనే కారణాలతో ప్రజలు విస్తృతంగా తినే పొలుసులు చేపల్లో విషం దాగి ఉంది. సీసం, క్రోమియం, నికెల్, కాడ్మియం వంటి భార లోహాలు పేరుకుపోయినట్లు TG SSC జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోనే స్పష్టంగా పేర్కొన్నారు. దీర్ఘ కాలంలో కాలేయం, కిడ్నీ, నరాలపై ప్రభావం చూపనుంది.


