News June 21, 2024
HYD: సచివాలయంలో నేడు కేబినెట్ భేటీ

సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటి కానుంది. పరిపాలనకి సంబంధించిన అనేక అంశాలపై కేబినెట్ చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాకి నిధుల సమీకరణపై చర్చ.. కట్ ఆఫ్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చెయ్యనుంది. రుణమాఫీపై మహారాష్ట్ర, రాజస్థాన్లో పర్యటించి అధ్యయనం చేసిన అధికారులు, విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరంపై మాట్లాడతారు.
Similar News
News October 15, 2025
ఓయూ రిజిస్ట్రార్కు ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు

ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డికి ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు లభించింది. ద ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్(ఐఏఏ) నిర్వహించిన 47వ ఆల్ ఇండియా అకౌంటింగ్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ ఘనత సాధించారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జనార్దన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్(డీమ్డ్ యూనివర్సిటీ)లో ఈనెల 12, 13 తేదీల్లో ఈ సదస్సు జరిగింది.
News October 15, 2025
HYD: సనత్నగర్లో గన్, తల్వార్ సీజ్

హైదరాబాద్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్లో గన్తో హల్చల్ చేస్తున్న చంద్రకాంత్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకాంత్ గన్, తల్వార్తో కొంతకాలంగా కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు అతడి నుంచి గన్, తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
News October 15, 2025
హైదరాబాద్: లోన్ ఆఫర్ కాల్స్తో జాగ్రత్త

హైదరాబాద్లో ఫేక్ ఎన్జీఓ లోన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. బేగంపేటకు చెందిన ఓ వ్యక్తి(30) రూ. 7.9 లక్షలు మోసపోయాడు. హెచ్వైసీ ఫౌండర్ సల్మాన్ ఖాన్ డీపీతో వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి.. రూ.50 లక్షల లోన్ ఇస్తానని నమ్మించి, పలు ఫీజుల పేరుతో రూ. 7.9 లక్షలు వసూలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపరిచిత లోన్ ఆఫర్లను నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.