News October 21, 2025
HYD: సచివాలయానికి ‘కవచం’..!

HYD Dr.BR.అంబేడ్కర్ సచివాలయానికి వచ్చే ప్రతి సామాన్య పౌరుడి నుంచి సీఎం వరకు మానవ ప్రాణాల రక్షణే ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది. ఇటీవల డ్రోన్లు చక్కర్లు కొట్టడం, నకిలీ ఉద్యోగులు చొరబడటం వంటి ఘటనలతో భద్రతా వలయంపై ఆందోళన నెలకొంది. దీంతో కోట్ల మంది నమ్మకాన్ని నిలబెట్టేందుకు, ప్రమాదాలను తొలిపొరలోనే అడ్డుకునేందుకు ఎక్స్-రే స్కానర్ వ్యవస్థ (X-ray BSS)నిర్వహణకు ప్రభుత్వం రూ.15,95,360 ఖర్చు చేస్తోంది.
Similar News
News October 22, 2025
NZB: రియాజ్ కేసు విచారణలో ఉంది: డీజీపీ

నిజామాబాద్లో రియాజ్ కేసు విచారణలో ఉందని, పూర్తి వివరాలు వెల్లడించలేమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రియాజ్ను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించి గాయపడ్డ ఆసీఫ్ కుటుంబానికి రూ.50 వేలు రివార్డు అందించామన్నారు. రాష్ట్రంలో 65 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు.
News October 22, 2025
అక్టోబర్ 22: చరిత్రలో ఈరోజు

1901: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం జయంతి
1998: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ మరణం
2001: సినీ నటుడు రామకృష్ణ మరణం
2008: చంద్రుడి పైకి మానవరహిత చంద్రయాన్-1ను ప్రయోగించిన ఇస్రో
➣అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం
News October 22, 2025
REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే?

2023 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. BRS నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ 80,549 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ 64,212 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించగా ఎంఐఎం అభ్యర్థి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 ఓట్లు పొందారు.