News October 21, 2025
HYD: సదర్.. దున్నరాజుకు రూ.31 వేల మద్యం

ముషీరాబాద్లో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో కేరళ నుంచి తెచ్చిన 2,500 కిలోల ‘దున్నరాజు’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్సవంలో యాదవులు రూ.31,000 విలువైన ‘రాయల్ సెల్యూట్’ బాటిల్ను దున్నరాజుకు తాగించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలో సదర్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి.
Similar News
News October 21, 2025
HYD: ఎన్నికల పరిశీలకులను నియమించిన ఎలక్షన్ కమిషన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగియనుండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికను పరిశీలించేందుకు ముగ్గురు అధికారులను పరిశీలకులుగా నియమించింది. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఓం ప్రకాశ్ త్రిపాఠి(IPS), ఇక వ్యయ పరిశీలకులుగా IRS అధికారి సంజీవ్ కుమార్ లాల్ నియమితులయ్యారు.
News October 21, 2025
HYD: ఎన్నికల పరిశీలకులను నియమించిన ఎలక్షన్ కమిషన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగియనుండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికను పరిశీలించేందుకు ముగ్గురు అధికారులను పరిశీలకులుగా నియమించింది. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఓం ప్రకాశ్ త్రిపాఠి(IPS), ఇక వ్యయ పరిశీలకులుగా IRS అధికారి సంజీవ్ కుమార్ లాల్ నియమితులయ్యారు.
News October 21, 2025
MBNR: PU స్పాట్ అడ్మిషన్.. నేడే లాస్ట్

పాలమూరు వర్శిటీలో ఎంబీఏ & ఎంసీఏ కోర్సులలో మిగిలినటువంటి సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ రిజిస్ట్రార్ పి.రమేష్ బాబు Way2Newsతో తెలిపారు. కన్వీనర్ టీజీ ఐసెట్-2025 క్వాలిఫై ఉండాలని, www.palamuruunivetsity.ac.in వెబ్సైట్లో ఈనెల 21లోగా దరఖాస్తులు చేసుకుని, 22న ఆయా కళాశాలలో పబ్లికేషన్స్ ఇవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.