News March 7, 2025
HYD: సన్రైజర్స్ అభిమానులకు శుభవార్త

ఈ నెల 23న రాజస్థాన్ రాయల్స్, 27న లక్నో సూపర్ జెయింట్స్తో సన్రైజర్స్ జట్టు తలపడనుంది. ఈ 2 మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండు మ్యాచ్ల టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్లో అందుబాటులో ఉంటాయని సన్రైజర్స్ ప్రకటించింది. కాగా.. ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఇవాళ ఉ.11 నుంచి ప్రారంభంకానుంది.
Similar News
News February 23, 2026
తొలిరోజు 635 మంది గైర్హాజరు: ఆర్ఐఓ

అనంతపురం జిల్లాలోని 64 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐఓ రమణ నాయక్ తెలిపారు. జిల్లాలో 22,848 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 22,213 మంది రాశారని చెప్పారు. వివిధ కారణాలతో 635 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు.
News February 23, 2026
కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు: CM

AP: రాజమండ్రి కల్తీ పాల <<19215623>>ఘటన<<>> బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. నలుగురు చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్పై ఉన్నారని చెప్పారు. 8 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. పాల వ్యాపారి గణేశ్వరరావును అరెస్ట్ చేశామని, బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామన్నారు.
News February 23, 2026
బంజారాహిల్స్లో ర్యాపిడో బైక్ను ఢీ కొట్టిన ట్యాంకర్.. ఇద్దరి మృతి

బంజారాహిల్స్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ర్యాపిడో బైక్ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న రైడర్ (హోంగార్డ్), అతని వెనక కూర్చున్న యువతి అక్కడికక్కడే మృతి చెందారు. యువతిని పిక్ చేసుకున్న కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.


