News April 1, 2024
HYD: సమతామూర్తి సందర్శన వేళల్లో మార్పు

HYD శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో కొలువుదీరిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన వేళలను మార్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చన్నారు. శని, ఆదివారాల్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు భక్తులు రావచ్చన్నారు. SHARE IT
Similar News
News December 19, 2025
BREAKING: రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు

రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018లో సరూర్నగర్ పరిధిలో 17 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి కేసులో పెళ్లి పెద్దగా వ్యవహరించిన బాలిక తండ్రికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. బాలిక భర్త, తండ్రికి రూ. 75వేల జరిమానా న్యాయమూర్తి వేశారు. బాధితురాలికి రూ.15లక్షల పరిహారాన్ని న్యాయమూర్తి మంజూరు చేశారు.
News December 19, 2025
HYD: దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం ఎక్కడంటే?

‘ఘట్కేసర్లో దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం!’ శీర్షికన Way2Newsలో కథనం వెలువడడంతో జనాల్లో చర్చ హోరెత్తింది. నిర్మాణం ఎక్కడా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. మేడ్చల్ (D) యమ్నాంపేట్ రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో 7ఎకరాల్లో 72 అంతస్తుల టవర్తో పాటు 62అంతస్తుల 2భవనాల నిర్మాణానికి ఓ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ‘డాన్సింగ్ డాఫోడిల్స్ థీమ్’తో రూపుదిద్దుకునే ఈ కట్టడం గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా కనువిందు చేయనుంది.
News December 19, 2025
HYD: ఆస్తి పన్ను చెల్లింపు జీహెచ్ఎంసీ యాప్లోనే!

శివారు ప్రాంతాల విలీనంతో జీహెచ్ఎంసీ వెబ్సైట్లో మార్పులు చేసింది. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సు, తదితర ఫీజులు జీహెచ్ఎంసీ యాప్లో చెల్లించేలా కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకనుంచి ట్రేడ్ లైసెన్స్, ఆస్తు పన్నులు యాప్లో చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం యాప్లో ప్రత్యేక విండో ఏర్పాటు చేశారు. అయితే శివారు ప్రాంతాలకు ఎంత బిల్లు చెల్లించాల్సి వస్తుందని వ్యాపారస్థులు, ప్రజలు భయపడుతున్నారు.


