News March 17, 2026
HYD: సమ్మర్.. METROనే బెటర్..!

పెరుగుతున్న ఎండలతో HYD జనం ఇప్పుడు ఎక్కువగా METROలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. RTCతో పోల్చితే టికెట్ ధరలు ఇంచుమించు ఒకేళా ఉండడంతో మెట్రో జర్నీనే బెటర్ అంటున్నారు. ఇందుకు ముఖ్య కారణాలు సిటీలో పర్సనల్ వెహికిల్లో ట్రావెల్ చేయాలన్నా, RTC బస్సులో వెళ్లాలన్నా ట్రాఫిక్ తిప్పలతో పాటు ఉక్కపోత. పైగా గంటలో వెళ్లాల్సిన చోటుకు 20- 30 నిమిషాల్లోనే ACలో వెళ్తుండటంతో చాలామంది వీటినే ప్రిఫర్ చేస్తున్నారు.
Similar News
News March 17, 2026
జగిత్యాల: పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి నిర్ణయం.. సంజయ్ కామెంట్స్

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ మీడియా చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి పార్టీని వీడాలని ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఎల్.రమణతో కలిసి పనిచేశానని, అలాగే జీవన్ రెడ్డితో కూడా కలిసి పని చేస్తానని తెలిపారు. ఎల్.రమణలాంటి నాయకులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందని, అలాంటి నిర్ణయాల్లో జరిగిన తప్పిదాల వల్లనే BRS మళ్లీ అధికారంలోకి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
News March 17, 2026
కరీంనగర్: కాలువలో గల్లంతైన ప్రభుత్వ ఉద్యోగి మృతి

కరీంనగర్(D) కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కాలువలో గల్లంతైన ప్రభుత్వ ఉద్యోగి రాచకొండ లచ్చయ్య (55) మృతదేహం లభ్యమైంది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆయన, ఆదివారం స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. ఒడ్డున దుస్తులు, బైక్ గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టగా చింతకుంట శివారులో మృతదేహం దొరికింది. భార్య పద్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 17, 2026
కానాయిపల్లిలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

వనపర్తి జిల్లాలో 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కానాయిపల్లిలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మదనపూర్ 38.2, వెలుగొండ 37.4, వీపనగండ్ల 37.2, పెద్దమందడి, దగడ 36.9, ఆత్మకూరు, వనపర్తి 36.3, అమరచింత, జానంపేట 35.8, శ్రీరంగాపూర్ 35.5, పానగల్, రేమద్దుల, పెబ్బేరు, ఘన్పూర్ 35.3, విలియంకొండ 35.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


