News September 3, 2024

HYD: సర్కారు నిర్లక్ష్యానికి 20 మంది బలి: కేటీఆర్

image

రాష్ట్రంలో వరద సహాయక చర్యలు చేపట్టడంలో రేవంత్ సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ఈ నిర్లక్ష్యం ఖరీదు 20 మంది ప్రాణాలు కోల్పోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనుల వల్లే హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పిందని అన్నారు.

Similar News

News February 18, 2026

మాదకద్రవ్యాలతో రీల్స్ చేశారు.. అడ్డంగా బుక్ అయ్యారు!

image

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత దారి తప్పుతోంది. ఫలక్నుమాకు చెందిన శ్రీచరణ్, విజయ్ కృష్ణ అనే ఇద్దరు యువకులు శివరాత్రి పర్వదినం రోజున మాదకద్రవ్యాలను ప్రదర్శిస్తూ రీల్స్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. గమనించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్, రీల్స్ మత్తులో పడి బంగారు భవిష్యత్తును కటకటాల పాలు చేసుకోవద్దని యువతను హెచ్చరించారు.

News February 18, 2026

ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్ల పట్టివేత!

image

ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్లను తండైలో కలిపి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన వికాస్ శర్మ (23) ఇటీవలే ఉప్పుగూడకు మకాం మార్చాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ అధికారులు అతని ఇంటిపై దాడిచేసి తనిఖీలు నిర్వహించారు. సుమారు 9.6కిలో గ్రాముల బరువు చేసే 1,920 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.

News February 18, 2026

రంగారెడ్డి: పోలీసుల అదుపులో 23 మంది విదేశీయులు

image

టోలిచౌకి పరిధిలోని పలు కాలనీల్లో డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షణలో 250 మంది పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలతో పాటు 53 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.