News November 18, 2025

HYD: ‘సామాజిక, ఆర్థిక అణిచివేతలతో నక్సలిజం వైపు’

image

సామాజిక, ఆర్థిక అణచివేతలతో యువత నక్సలిజం వైపు వెళ్తున్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కిగౌడ్ అన్నారు. ఆదివాసి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సోమవారం జరిపిన ఆదివాసి గిరిజన యువత ఇంట్రాక్షన్(వాలిడిక్టరీ)లో మాట్లాడారు. సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి గవర్నర్, మధుయాష్కీ బహుమతులు అందజేశారు. వనరులున్నా సదుపాయాలు, సంపద లేదన్నారు.

Similar News

News November 18, 2025

ఉల్లాసంగా యూనిటీ ర్యాలీ.. పాల్గొన్న కేంద్రమంత్రి

image

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సర్దార్ @ 150యూనిటీ ర్యాలీ ఉల్లాసంగా సాగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, MLC అంజిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గితే, వందలాది మంది యువత బతుకమ్మ ఘాట్ నుంచి కొత్తచెరువు వరకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. దేశ ఐక్యతకు పాటుపడతామని ఈ సందర్భంగా యువత ప్రముఖులతో ప్రతిజ్ఞ చేసింది.

News November 18, 2025

ఉల్లాసంగా యూనిటీ ర్యాలీ.. పాల్గొన్న కేంద్రమంత్రి

image

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సర్దార్ @ 150యూనిటీ ర్యాలీ ఉల్లాసంగా సాగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, MLC అంజిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గితే, వందలాది మంది యువత బతుకమ్మ ఘాట్ నుంచి కొత్తచెరువు వరకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. దేశ ఐక్యతకు పాటుపడతామని ఈ సందర్భంగా యువత ప్రముఖులతో ప్రతిజ్ఞ చేసింది.

News November 18, 2025

విధుల్లో ఉండగా గుండెపోటు.. హాస్టల్ వంటమనిషి మృతి

image

వేములవాడ మున్సిపల్ తిప్పాపూర్ బీసీ సంక్షేమ వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న CH.మహేశ్వరి(50) గుండెపోటుతో కన్నుమూశారు. 15 ఏళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న ఆమె మంగళవారం విధుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దినెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆమె మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు.