News August 25, 2025
HYD: సీఎంకు ఇంత భయం ఎందుకు?: RSP

HYD ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రాక నేపథ్యంలో ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంపై BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రికి విశ్వ విద్యాలయం లోపలికి పోవాలంటే ఇంత భయమెందుకని ప్రశ్నించారు. ఈ కనీవినీ బందోబస్తు ఎందుకు? విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? అని నిలదీశారు.
Similar News
News August 25, 2025
పాక్కు అలర్ట్.. మానవత్వం చాటుకున్న భారత్

సింధు జలాల ఒప్పందం నిలిచిపోయినా వరదలపై పాకిస్థాన్ను హెచ్చరించి ఇండియా మానవత్వం చాటుకుందని PTI కొన్ని కథనాలను ఉటంకించింది. భారీ వర్షాలకు జమ్మూకశ్మీర్లోని తావి నది ఉప్పొంగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనిపై పాక్ను ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ ద్వారా అలర్ట్ చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. మన అలర్ట్తో పాక్ యంత్రాంగం తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
News August 25, 2025
ఊట్కూర్: గణేష్ నవరాత్రి ఏర్పాట్లకు కలెక్టర్కు వినతి

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ను ఊట్కూర్ ఉమ్మడి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కోరారు. ఉత్సవ ఊరేగింపు జరిగే మార్గంలో ఏర్పడిన గుంతలు చదును చేయాలని, వీధిలైట్ల ఏర్పాటు, పెద్ద చెరువు వద్ద నిమజ్జనానికి క్రేన్తో పాటు రక్షణ కోసం కంచెను వేయాలన్నారు. ఇందుకు ప్రత్యేక నిధులను కేటాయించాలని వారు వినతిపత్రం అందజేశారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
News August 25, 2025
పొగాకు కొనుగోళ్లలో సమతుల్యం పాటించాలి: కలెక్టర్

పొగాకు కొనుగోళ్లలో సమతుల్యం పాటించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్లపై బోర్డు రీజనల్ మేనేజర్ రామారావు, ఐటీసీ మార్కెటింగ్ మేనేజర్ రాజుదొరైలతో సోమవారం ఒంగోలులోని తన కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. కొనుగోళ్లకు సంబంధించి పొగాకు కంపెనీలు ఇచ్చిన ముందస్తు రిక్వైర్మెంట్స్, జిల్లాలో పొగాకు ఉత్పత్తిపై కలెక్టర్ ఈ సందర్భంగా ఆరా తీశారు.