News June 3, 2024
HYD: సీఎం రేవంత్ రెడ్డి మనవడితో సరదాగా గవర్నర్

సీఎం రేవంత్ రెడ్డి మనవడితో గవర్నర్ రాధాకృష్ణన్ కొద్దిసేపు సరదాగా గడిపారు. HYD ట్యాంక్ బండ్ వద్ద రాత్రి జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో స్టేజీపై తన మనవడిని సీఎం గవర్నర్కు పరిచయం చేశారు. ఈ సమయంలో గవర్నర్ ఆ చిన్నారికి రెండు నోట్లను ఇచ్చారు. దీంతో ఆ బాలుడు వద్దన్నట్లుగా ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చాడు. అయినా గవర్నర్ మరోసారి ఆ నోట్లను చిన్నారికి ఇస్తూ జేబులో పెట్టడంతో సీఎం నవ్వుతూ చూశారు.
Similar News
News February 17, 2026
HYD: RTC బస్సుల్లో ఆధార్ కార్డు లొల్లి..!

ఆర్టీసీ బస్సుల్లో ఒరిజినల్ ఆధార్ కార్డు అంశంపై తరచూ వివాదాలు జరుగుతున్నాయి. మహిళలు, కండక్టర్లు, టికెట్ ఇన్స్పెక్టర్లతో వాగ్వాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్టీసీ MD సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. ఆధార్ కార్డు మాత్రమే కాదు, పాన్ కార్డు, భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపించినా సరిపోతుందని గతంలో తెలిపారు.
News February 17, 2026
HYD: జేఈఈ మెయిన్స్లో Resonance ప్రభంజనం!

JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాల్లో హైదరాబాద్ Resonance విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. 55 మందికి పైగా విద్యార్థులు 99 పర్సెంటైల్కు మించి స్కోరు చేసి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. సమృద్ధి భట్టాచార్య 99.988, రేవంత్ వంగల 99.982, సాకేత్ రెడ్డి 99.932, ఆదిత్య రెడ్డి 99.918, అన్విత రెడ్డి 99.915 అగ్రస్థానంలో నిలిచారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణే ఈ విజయానికి కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
News February 17, 2026
HYD: ఈ అలవాట్లతో ప్రాణానికి ముప్పు!

మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం యువత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం, ఉప్పు-చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిపారు. విపరీతమైన స్క్రీన్ టైమ్ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతోందన్నారు. తగినంత నీరు తాగకపోవడం కిడ్నీ రాళ్లకు దారితీస్తోందని సూచించారు. కాలుష్యం కూడా ఆరోగ్యానికి ముప్పుగా మారాయన్నారు.


