News October 14, 2025

HYD: సీజనల్ వ్యాధుల నియంత్రణపై హెల్త్ మినిస్టర్ సమీక్ష

image

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రి దామోదర రాజనరసింహ HYDలోని సెక్రటేరియట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈఏడాది డెంగీ 2,900, మలేరియా 209, టైఫాయిడ్ 4,600, చికున్‌గున్యా249 కేసులు నమోదవగా గతంతో పోల్చితే గణనీయంగా తగ్గాయని మంత్రికి వివరించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రబలే వ్యాధులు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

Similar News

News October 14, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మహిళల ఓట్లే కీలకం..!

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పురుషుల ఓట్లు వివిధ పార్టీలకు డివైడ్ అయ్యే అవకాశం ఉన్నా మహిళల ఓట్లు మాత్రం ఒకే పార్టీకి గంప గుత్తగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 3,98,982ఓటర్లు ఉండగా అందులో 1,91,590మంది మహిళా ఓటర్లే ఉన్నారు. కాగా ఫ్రీబస్సు స్కీమ్‌తో‌ మహిళలు తమకే ఓట్లు వేస్తారని కాంగ్రెస్ నేతలు అంటుండగా గతంలో బతుకమ్మ చీరలిచ్చిన KCRవైపే మహిళలు ఉన్నారని BRSనేతలు చెబుతున్నారు.

News October 14, 2025

బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

image

HYD బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ పుష్పాలు, పట్టు చీరతో అలంకరించి, పంచ హారతులు, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

News October 14, 2025

HYD: BRS సభలో కన్నీరు పెట్టుకున్న మాగంటి సునీత

image

HYD జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌లో బీఆర్ఎస్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభలో ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త, దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను గుర్తుతెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఆమెకు ధైర్యం చెప్పారు. హరీశ్‌రావు సైతం ఉద్వేగానికి లోనయ్యారు.