News August 22, 2025

HYD: సెప్టెంబరు నుంచి 100 రోజుల అక్షరాస్యత ఉద్యమం

image

సెప్టెంబరు నుంచి100 రోజులపాటు అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ఉద్యమం ప్రారంభం కానుంది. 15 ఏళ్ల వయసు దాటిన వారి కోసం ప్రత్యేకంగా 16 పాఠాలు ముద్రించి, అక్షర వికాసం కోసం ప్రభుత్వం కృషి చేయనుందని అధికారులు తెలిపారు.

Similar News

News August 22, 2025

మెదక్: రేపు డయల్ యువర్ డీఎం

image

మెదక్ ఆర్టీసీ డిపోలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ శుక్రవారం తెలిపారు. రేపు ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు తమ సందేహాల నివృత్తికి 7842651592 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సౌకర్యాలపై సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని డీఎం పేర్కొన్నారు.

News August 22, 2025

కంచికచర్లలో రోడ్డు ప్రమాదం.. తల్లి, బిడ్డ మృతి

image

కంచికచర్ల మండలం కీసర గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పసికందు మృతిచెందిన <<17483745>>విషయం తెలిసిందే<<>>. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి నాగబత్తిని చైతన్యను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 22, 2025

నటుడికి భార్య విడాకులు?

image

నటుడు గోవింద-సునీత ఆహుజా దంపతులు విడాకులు తీసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాలు మరోసారి కోడై కూస్తున్నాయి. భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ బాంద్రా ఫ్యామిలీ కోర్టులో సునీత విడాకులకు అప్లై చేసినట్లు తెలిపాయి. భర్త తనను వేధిస్తున్నాడని, మోసం చేశాడని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నట్లు వెల్లడించాయి. కాగా గతంలోనూ వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరగగా సునీత <<15621494>>ఖండించారు<<>>. ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.