News October 10, 2025
HYD: సైబర్ మోసం.. రూ.7.7కోట్లు మాయం

మ్యాట్రిమోనీ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని HYD నగరంలోని సైబర్ సెక్యూరిటీ టీం హెచ్చరించింది. మ్యారేజ్ కం ఇన్వెస్ట్మెంట్ మోసాలతో ఓ వ్యక్తి ఏకంగా రూ.7.7కోట్లు పోగొట్టుకున్నట్లుగా వివరించింది. నూతన లింకులు, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ప్రతి మెసేజ్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సైబర్ మోసం గుర్తిస్తే 1930 కు కాల్ చేయాలని సూచించింది.
Similar News
News October 10, 2025
బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాలి: అదనపు కలెక్టర్

2024-25 రబీ సీజన్ బియ్యాన్ని రా మిల్లర్లు వెంటనే ప్రభుత్వానికి అందించాలని జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. జనగామ కలెక్టరేట్లో శుక్రవారం మిల్లర్లతో సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కేటాయింపులు మిల్లర్ల సూచనల ప్రకారం ఉంటాయని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లను తక్షణం సమర్పించాలని కోరారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు రావద్దన్నారు.
News October 10, 2025
బిహార్లో రేపు NDA కూటమి సమావేశం

త్వరలో బిహార్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో NDA కూటమి రేపు అక్కడ కీలక సమావేశం నిర్వహించనుంది. JDU, BJPతో పాటు కూటమిలోని ఇతర పార్టీల సీట్ల పంపకాలపై ఇందులో చర్చించనున్నారు. మొత్తం 243 సీట్లలో జేడీయూ, బీజేపీ 205 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏయే స్థానాల్లో ఎవరెవరు బరిలో దిగాలనే అంశంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా తొలి విడత ఎన్నికలకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
News October 10, 2025
పాఠశాలలో మత బోధనలు నిజమే: ఎంఈఓ శ్రీధర్

వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మత బోధనలు చేసిన విషయం నిజమేనని ఎంఈఓ శ్రీధర్ నిర్ధారించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు చేరుకునే యాజమాన్యంతో విద్యార్థులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ క్రైస్తవ మతస్థుడు తరగతి గదిలో విద్యార్థులకు బోధనలు చేసిన విషయం నిజమేనని తేలిందని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి నివేదిక డీఈఓకు అందిస్తామన్నారు.