News May 22, 2024
HYD: సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్ల గాలం.. జర జాగ్రత్త!
సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా యూజర్లను టార్గెట్ చేశారని, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, X వంటి వాటిల్లో ఫేక్ ప్రకటనలు పెట్టి గాలం వేసి, మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తాజాగా HYD నాంపల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన రీల్స్ ఆధారంగా ఒక యాప్లో విడతల వారీగా రూ.33.26 లక్షల పెట్టుబడి పెట్టి, మోసపోయి HYD CCS పోలీసులను ఆశ్రయించాడు.
Similar News
News October 2, 2024
HYD: ప్రపంచాన్ని మేల్కొల్పిన గొప్ప మహనీయుడు: KTR
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ అగ్రనాయకులతో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీలకు తెలంగాణ భవన్లో నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, పార్టీ నాయకులు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.
News October 2, 2024
HYD: ‘దసరా సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు’
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 14 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 15వ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఆదేశాలు పాటించకుండా ప్రత్యేక క్లాసెస్, ట్యూషన్లు వంటివి కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ నిర్వహిస్తే, అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.
News October 2, 2024
HYD: మూసీ ప్రజలు నిశ్చింతంగా ఉండండి: మధుయాష్కి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదని దానికి నాది గ్యారెంటీ అని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇళ్లు ఇచ్చే ప్రభుత్వమని, ఎవరి ఇళ్లు కూలగొట్టదని పేర్కొన్నారు. ఇళ్ల పైకి ఒక్క గడ్డపార రాదని.. ఒక జేసీబీ కూడా రాకుండా చూసే బాధ్యత తమదని అన్నారు.