News November 13, 2025

HYD: స్పాలో అమ్మాయిలతో అబ్బాయిలకు మసాజ్

image

డిఫెన్స్‌కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న జెనోరా స్పా మసాజ్ సెంటర్‌పై నేరేడ్‌మెట్ పోలీసుల దాడి చేశారు. ఈ స్పాలో నిబంధనలకు విరుద్ధంగా మహిళా థెరపిస్ట్‌లతో పురుషులకు క్రాస్ మసాజ్‌లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పా యజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అవసరమైన అనుమతులు లేకుండా నడిపినందుకు సంబంధిత పత్రాలు, సీసీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News November 13, 2025

మార్నింగ్ అప్డేట్స్

image

* ఢిల్లీ పేలుడు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి.. 13కు చేరిన మరణాల సంఖ్య
* APలోని గుంటూరులో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం.. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం PSలో కేసు నమోదు
* TGలోని ములుగులో చలికి వృద్ధురాలు రాధమ్మ(65) మృతి
* తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
* అఫ్గానిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం

News November 13, 2025

మంచిర్యాలలో విషాదం.. 7 నెలల గర్భిణి మృతి

image

మంచిర్యాలలో విషాదం జరిగింది. కాసిపేట మండలం కోమటిచేనుకు చెందిన లక్ష్మణ్ BSF జవాన్‌గా ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య అనురాధ(35), కొడుకు ఉన్నాడు. కాగా భార్య ప్రస్తుతం 7నెలల గర్భిణి. ఆమెకు 2 సార్లు ఫిట్స్, కడుపునొప్పి రావడంతో మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రసవం చేసేందుకు ఆపరేషన్ చేయగా తల్లి, పుట్టిన మగ శిశువు మృతిచెందారు. విషయం తెలిసి ఢిల్లీ నుంచి లక్ష్మణ్ కాసిపేటకు వస్తున్నారు.

News November 13, 2025

కరీంనగర్: విద్యాశాఖలో ఆ ‘FILE మాయం’..!

image

పదో తరగతి పరీక్షల మూల్యాంకన జవాబు పత్రాలు అమ్మగా వచ్చిన నిధులకు సంబంధించిన ఫైల్ కరీంనగర్ విద్యాశాఖలో మాయమైనట్లు తెలుస్తోంది. 2022- 23 MAR, JUN మూల్యాంకన పత్రాలను అధికారులు అమ్మారు. కాగా, దీని ద్వారా వచ్చిన రూ.1.30 లక్షలు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. దీనిపై అటు సూపరింటెడెంట్ ఇటు ఆఫీసు సిబ్బంది ఒకరిపైఒకరు అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ గోల్‌మాల్ ముఖ్యమైన విద్యాశాఖను అభాసుపాలు చేస్తోంది.