News October 25, 2025
HYD: స్వచ్ఛ భారత్ మిషన్లో పాల్గొననున్న GHMC

స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన స్వచ్ఛ షహర్ జోడి కార్యక్రమంలో భాగంగా HYD మెంటర్ నగరంగా GHMC ముందుకొచ్చింది. ఈ మెరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తగిన విధంగా చర్యలు చేపట్టనున్నారు. వివిధ పట్టణాల్లో సర్వే సైతం చేపట్టనున్నట్లు తెలిపారు.
Similar News
News October 25, 2025
ప్రత్యేక సదరం క్యాంపుల నిర్వహణకు చర్యలు: దీపక్ తివారీ

జిల్లాలో దివ్యాంగ పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు పింఛన్ పునరుద్ధరణ కొరకు ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి సెర్ప్ సిఈఓ దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ASF జిల్లా అదనపు కలెక్టర్, గ్రామీణ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగవైకల్య నిర్ధారణ పరీక్షల కొరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.
News October 25, 2025
సంగారెడ్డి: ఇంటర్ సిలబస్లో మార్పులు

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ సిలబస్లోనూ మార్పులు చేశారు. ఫస్ట్ ఇయర్ ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. 20 ఇంటర్నల్, 80 ఎక్స్టర్నల్ పరీక్షల మార్కులు ఉన్నాయి. 12 ఏళ్ల తర్వాత సైన్స్ కోర్సు సిలబస్లో ఇంటర్ బోర్డు మార్పు చేసింది.
News October 25, 2025
జగిత్యాల కలెక్టరేట్ గేటు ఎదుట వంట సామగ్రితో నిరసన

తమ ఇంటికి వెళ్లే ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసుకుని దారి గుండా వెళ్లనివ్వడం లేదని, అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని జగిత్యాల కలెక్టరేట్ గేటు ఎదుట వంట సామగ్రితో నిరసన వ్యక్తం చేశారు. వెల్గటూర్ (M) జగదేవ్ పేటకు చెందిన నూకల దీవెన కుటుంబసభ్యులు వంట సామగ్రితో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు తమ సమస్యను వివరించారు.


