News September 21, 2025
HYD: హత్య కేసు ఛేదన.. క్యాబ్ డ్రైవర్కు సత్కారం

HYD కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక సమాచారం అందించిన క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈరోజు అభినందించారు. కేసు దర్యాప్తులో ధైర్యం చూపించినందుకు ఆయనకు క్యాష్ రివార్డ్ అందజేశారు. బాలానగర్ DCP సురేశ్కుమార్తోపాటు కూకట్పల్లి పోలీస్ సిబ్బందిని కూడా కమిషనర్ ప్రశంసించి నగదు బహుమతి ఇచ్చారు. ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చన్నారు.
Similar News
News September 21, 2025
ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం

AP: వైసీపీ చీఫ్ YS జగన్ అధ్యక్షతన ఈ నెల 24న ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, సమన్వయకర్తలు హాజరు కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
News September 21, 2025
యాదాద్రి: ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. భువనగిరి మండలం తుక్కాపురంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని, నిర్మాణంలో ఉన్న ఇండ్ల సంఖ్యను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుడు రాచకొండ పాండు ఇంటిని సందర్శించారు.
News September 21, 2025
మహిళల వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర

నిన్నటి ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా మధ్య జరిగిన <<17776758>>వన్డే<<>> మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉమెన్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్లు కలిపి అత్యధిక పరుగులు(781) చేసిన మ్యాచ్గా ఇది నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 412 పరుగులు చేయగా, టీమ్ ఇండియా 369 రన్స్ చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లాండ్-దక్షిణాప్రికా(2017లో 678 రన్స్) పేరిట ఉండేది.