News April 6, 2025

HYD: హనుమంతుడు లేని రామాలయం!

image

అతి పురాతన ఆలయం మన HYD శివారులో ఒకటుంది. శంషాబాద్‌ మం. పరిధిలో 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించి, శ్రీ లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి ఏకశిల రాతి విగ్రహాలు నెలకొల్పారు. సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి ‘అమ్మపల్లి’అనే పేరు వచ్చిందని నానుడి. గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం లేని అరుదైన రామ మందిరం ఇది. ఇక్కడి నుంచే రాముడు ఒంటిమిట్టకు వెళ్లినట్లు పెద్దలు చెబుతారు.

Similar News

News April 7, 2025

దివ్యాంగులకు 70 ట్రై సైకిళ్లు అందించిన పొదెం వీరయ్య

image

తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ CSRలో భాగంగా ఆదివారం కొత్తగూడెం ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 70 మంది దివ్యాంగులకు మోటర్ ట్రై సైకిళ్లను అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పొదెం వీరయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అటవీ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ జి. స్కైలాబ్ పాల్గొన్నారు.

News April 7, 2025

నేడు భద్రాచలం శ్రీరాముడి మహాపట్టాభిషేకం

image

TG: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నేడు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉ.10.30 గం. నుంచి మ.12.30 వరకు కళ్యాణ మండపంలో అభిషేక మహోత్సవం ఉంటుంది. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, చక్రాలు, కిరీటం, శంఖు ధరింపజేస్తారు. ఏటా శ్రీరామనవమి తర్వాత నిర్వహించే ఈ వేడుకకు ఈసారి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

News April 7, 2025

IPL: నేడు ముంబైతో ఆర్సీబీ ఢీ

image

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు వాంఖడేలో ముంబై, బెంగళూరు తలపడనున్నాయి. ముంబైకి రోహిత్, బుమ్రా ఇద్దరూ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జట్టు బలం పుంజుకోనుంది. అటు ఆర్సీబీలో బౌలర్లు, బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో సమష్టిగా విజయాలు సాధిస్తోంది. రెండూ బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు గెలుపెవరిదో చూడాలి.

error: Content is protected !!