News April 8, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి 57 ఫిర్యాదులు

HYDలోని హైడ్రా కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో భాగంగా 57 ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తైతే చాలా సమస్యలకు పరిష్కారం దొరకుతుందని, ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News November 9, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
* తాడిపత్రిలో బాలిక యశస్వి భారతి(9) 6ని.ల 9సెకన్లలో 100 ట్యూబ్లైట్లను తలపై పగలగొట్టించుకుంది. వరల్డ్ రికార్డ్స్లో స్థానం కోసం ఈ సాహసం చేసింది.
* ఒకప్పుడు గిరిజన గ్రామాలంటే డోలీ మోతలని, ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయని మంత్రి సంధ్యారాణి చెప్పారు.
News November 9, 2025
చిరంజీవికి థాంక్స్.. అలాగే క్షమాపణలు: RGV

కల్ట్ మూవీ ‘శివ’ ఈనెల 14న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ‘చిరంజీవికి ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.
News November 9, 2025
వనపర్తి: ర్యాగింగ్ పై నిఘా.. SP WARNING

వనపర్తి జిల్లా కేంద్రం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థల్లో ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ర్యాగింగ్ జరుగుతున్నట్లు తెలిసిన, చూసిన వారు యాంటీ ర్యాగింగ్ కమిటీ, డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థుల భద్రతకు పోలీసులు, కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని సూచించారు.


