News March 9, 2025

HYD: 10 జాతీయ రహదారులు పూర్తి: కేంద్ర మంత్రి

image

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

ములుగు: ‘స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి’

image

గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి, వ్యాపారాలపై దృష్టి సారించాలని జిల్లా పరిశ్రమల మేనేజర్ సిద్ధార్థ రెడ్డి సూచించారు. ములుగులో గురువారం PMEGP పథకాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సబ్సిడీల ద్వారా రుణాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీసీ మేనేజర్ విక్రమ్ చాత రాజు, అసిస్టెంట్ మేనేజర్ భూక్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

News November 20, 2025

MHBD: ‘స్కాలర్షిప్ నమోదు ప్రక్రియ పెంచాలి’

image

ఎస్సీ విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 5 నుంచి 8వ తరగతి బాలబాలికలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు, 9, 10 తరగతి విద్యార్థులకు రూ.3500 వరకు, ప్రైవేట్ హాస్టల్ విద్యార్థులకు రూ.7000 వరకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

News November 20, 2025

అరకు: కాఫీ బెర్రీ బోరర్ నివారణకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

కాఫీ తోటలను ఆశిస్తున్న బెర్రీ బోరర్ పురుగు వ్యాప్తి నివారణకు కలెక్టర్ దినేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్షికంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఈ పురుగు వ్యాప్తి బయటికి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని గురువారం అరకు పర్యటనలో ఆదేశించారు. అరకు డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లో కాఫీ కొనుగోలు, అమ్మకాలకు నియంత్రణ విధించారు. ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు కాఫీ కొని అమ్మడాలను తాత్కాలికంగా నిషేధించారు.