News December 29, 2024
HYD: 10 నెలలు దాటినా రాని స్పష్టత.. కీలక ఫైల్స్ పెండింగ్

యూనివర్సిటీల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకపోవడంతో చాలా పనులు పెండింగ్లో పడుతున్నాయి. కౌన్సిల్ బాడీ లేకపోవడం అభివృద్ధికీ అడ్డంకిగా మారింది. నిర్ణయాల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ కీలకం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సభ్యుల పదవీకాలం ముగిసింది. ఆపై నూతన కౌన్సిల్ ఏర్పాటు అంశంలో ఎలాంటి ముందడుగు పడలేదు. దాదాపు 10 నెలలు దాటినా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆలస్యమవుతోంది.
Similar News
News December 23, 2025
మూడు కార్పొరేషన్లుగా మహానగరం..!

GHMCలో మున్సిపాలిటీల విలీనం అనంతరం మహానగరం 300 డివిజన్లకు పెరిగింది. అయితే ఇంత పెద్ద నగరానికి ఒకే కార్పొరేషన్ ఉండాలా లేక విభజించాలా అనే విషయాన్ని సర్కారు ఆలోచిస్తోంది. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
News December 23, 2025
ఢిల్లీకి చేరువలో HYD పొల్యూషన్

HYDలో ఎయిర్ క్వాలిటీ ఢిల్లో పరిస్థితి దగ్గరలో ఉంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 300 ఉండగా.. నగరంలో డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ 270కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించడం మేలని, చిన్న పిల్లలను దీని నుంచి కాపాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News December 23, 2025
మంగళవారం బల్కంపేట ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం విశేష పూజలు చేశారు. అర్చకులు, వేద పండితులు అమ్మవారిని పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలతో అభిషేకించారు. మంగళవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.


