News April 5, 2024
HYD: 10 లక్షల మందితో జన జాతర సభ: మంత్రి సీతక్క

దేశ ముఖచిత్రాన్ని మార్చేసే కీలకమైన లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచి 10 లక్షల మందితో జంగ్ సైరన్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. తుక్కుగూడలో ‘జన జాతర’ పేరిట రేపు నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 5 గ్యారంటీలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు.
Similar News
News October 14, 2025
HYD: ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లో మోసపోయిన తండ్రి, కూతుళ్లు..!

HYD LB నగర్కు చెందిన RTC ఉద్యోగి M.రామకృష్ణ(49), కూతురు మిథాలీ(23) ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లో మోసపోయారు. AUG 26న వారి స్నేహితుడు పంపిన LF వర్క్ అనే అప్లికేషన్లో రామకృష్ణ పెట్టుబడి పెట్టాడు. ప్రారంభంలో కొంత రాబడి చూపించగా మొత్తం రూ.1,35,210 ఇన్వెస్ట్ చేశాడు. కూతురు ఇన్వెస్ట్ చేసిన రూ.86,220 తిరిగి డ్రా చేసుకోలేకపోయారు. మోసపోయామని తెలుసుకుని ఫిర్యాదు చేశారని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.
News October 14, 2025
HYD: సరిపడా ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థుల అవస్థలు

సమయానికి గమ్యం చేరుకోవాలని ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరంగా యువకులు ప్రయాణం చేస్తున్నా దృశ్యాలు హయత్నగర్లో కనిపించాయి. అబ్దుల్లాపూర్మెట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో కాలేజీ విద్యార్థులు ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో నిత్యం ఇదే పరిస్థితి ఉందని, సంబంధిత అధికారులు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.
News October 14, 2025
BREAKING: HYD: కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

HYD బాలానగర్ PS పరిధిలో దారుణ ఘటన ఈరోజు చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో తల్లి ఇద్దరు కవల పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. పద్మారావు నగర్ ఫేజ్-1లో నివసిస్తున్న సాయిలక్ష్మి(27) తన రెండేళ్ల వయసు గల కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిని గొంతు నులిమి చంపి, అనంతరం భవనం పైనుంచి దూకి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.