News April 5, 2024
HYD: 10 లక్షల మందితో జన జాతర సభ: మంత్రి సీతక్క

దేశ ముఖచిత్రాన్ని మార్చేసే కీలకమైన లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచి 10 లక్షల మందితో జంగ్ సైరన్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. తుక్కుగూడలో ‘జన జాతర’ పేరిట రేపు నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 5 గ్యారంటీలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు.
Similar News
News November 18, 2025
HYD: జేఎన్టీయూలో వేడుకలు.. హాజరు కానున్న సీఎం

జేఎన్టీయూలో డైమండ్ జూబ్లీ, గ్లోబల్ అలుమ్నీ వేడుకలు 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రిన్సిపల్ డా.భ్రమర తెలిపారు. 21న సీఎం రేవంత్ రెడ్డి, 22న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారని పేర్కొన్నారు.
News November 18, 2025
HYD: జేఎన్టీయూలో వేడుకలు.. హాజరు కానున్న సీఎం

జేఎన్టీయూలో డైమండ్ జూబ్లీ, గ్లోబల్ అలుమ్నీ వేడుకలు 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రిన్సిపల్ డా.భ్రమర తెలిపారు. 21న సీఎం రేవంత్ రెడ్డి, 22న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారని పేర్కొన్నారు.
News November 18, 2025
హైదరాబాద్లో భారీగా స్థిరాస్తి విక్రయాలు

గ్రేటర్ HYDలో ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ నాటికి 17,658 స్థిరాస్తులు విక్రయించినట్లుగా స్థిరాస్తి కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ సంస్థ వెల్లడించింది. గతేడాది ఇదే టైమ్లో జరిగిన విక్రయాలతో పోలిస్తే 53% ఎక్కువ అని వెల్లడించింది. హైదరాబాద్ తర్వాత గిరాకీ అధికంగా ఉన్న నగరాల్లో బెంగళూరు, చెన్నై ఉన్నట్లు పేర్కొంది.


