News March 9, 2025

HYD: 10 జాతీయ రహదారులు పూర్తి: కేంద్ర మంత్రి

image

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.

Similar News

News December 18, 2025

షూటింగ్‌లో ప్రమాదం.. హీరో ఆదికి గాయాలు?

image

‘శంబాల’ షూటింగ్‌లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో హీరో ఆది సాయికుమార్ గాయపడినట్లు తెలుస్తోంది. గాయాలతోనే ఆయన షూటింగ్ కంప్లీట్ చేసి ఆస్పత్రికి వెళ్లినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమాకు యుగంధర్ దర్శకత్వం వహిస్తుండగా అర్చన, స్వాసిక, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. DEC 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News December 18, 2025

చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది: జగన్

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చేపట్టిన ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అయిందని YCP చీఫ్ జగన్ పేర్కొన్నారు. ‘CBN గ్రాఫ్ పడిపోతోంది. దీనికి కలెక్టర్లే కారణమని ఆయన అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ప్రైవేటీకరణే స్కామ్ కాగా సిబ్బందికి రెండేళ్ల పాటు జీతాలు GOVT ఇవ్వాలనుకోవడం మరో పెద్ద స్కామ్. వీటిపై కోర్టుకెళ్తాం. YCP అధికారంలోకి రాగానే వీటిని రద్దుచేస్తాం. బాధ్యులను 2 నెలల్లో జైల్లో పెడతాం’ అని హెచ్చరించారు.

News December 18, 2025

నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీహెచ్ శ్రీధర్

image

రాష్ట్రంలోని 5 జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్‌లుగా సీనియర్ IAS అధికారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సీహెచ్ శ్రీధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలోని అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలు తీరును ఈయన స్వయంగా పర్యవేక్షించనున్నారు.