News September 14, 2025

HYD: 1000 టన్నుల నిమజ్జన వ్యర్ధాలు తొలగింపు

image

వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత హుస్సేన్‌సాగర్‌తో పాటు చుట్టూ ఉన్న రోడ్లు, ఫుట్‌పాత్‌ల నుంచి GHMC, HMDA సిబ్బంది 1000 టన్నుల నిమజ్జన వ్యర్థాలు, చెత్తాచెదారం తొలగించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 500 మంది పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపులో నిమగ్నం అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమజ్జన వ్యర్థాలు 150 టన్నుల మేర అదనంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News September 14, 2025

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

image

శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 12 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1,12,226 క్యూసెక్కుల వరద నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 148.00 మీటర్ల నీటిమట్టం ఉండాల్సిన ప్రాజెక్టులో ప్రస్తుతం 147.81 మీటర్ల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. 20.175 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 19.6475టీఎంసీల నీరు నిల్వ ఉంది.

News September 14, 2025

జొన్న: కాండం తొలుచు పురుగు.. నివారణ

image

* పంట వేసిన 35 రోజుల నుంచి కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఎకరానికి 4 కేజీల కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలను కాండం సుడుల్లో వేయాలి.
* కత్తెర పురుగు లార్వా దశలో ఉంటే వేపనూనె(అజాడిరక్టిన్) 1500 పిపిఎం 5 ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పురుగు తీవ్రత అధికంగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ML, ఒక లీటరు నీటికి కలిపి సుడుల్లో పడేలా పిచికారీ చేయాలి.

News September 14, 2025

HYD: పొలిటికల్ డ్రామా.. ఓవర్ టూ అసెంబ్లీ

image

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన MLAల భవిత నేడు కీలక మలుపు తీసుకోనుంది. ‘పార్టీ మార్పు’పై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్‌కు తమ అభిప్రాయం చెప్పబోతున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ కార్యదర్శితో BRS నాయకులు సమావేశం కానున్నారు. వారిచ్చే రియాక్షన్‌ను బట్టి స్పీకర్ చర్యలు తీసుకోబోతున్నారు. ఈ తాజా రాజకీయ పరిణామాలతో నగరంలో పోలిటికల్ హీట్ మొదలైంది.