News January 20, 2025

HYD: 10TH, ఇంటర్, ITI, డిగ్రీ వారికి బెస్ట్ ఛాన్స్

image

HYD నాంపల్లి పరిధి మల్లేపల్లి ITI కాలేజీలో నేషనల్ ఇంటర్న్‌షిప్ మేళా నేడు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుందని అధికారులు తెలిపారు. 5వ తరగతి నుంచి 12 వరకు పాసైన వారు, ITI, బీటెక్ డిగ్రీ, ఇతర డిగ్రీలు చేసినవారికి ఇంటర్న్‌షిప్ అందించి, ఉద్యోగాలు కల్పించనున్నారు. 1000కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటారని, అన్ని జిల్లాల అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 28, 2025

HYD: పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన

image

హైటెక్స్‌లో 3 రోజులపాటు జరిగిన పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు దేశ విదేశాల నుంచి యాభై వేల మందికి పైగా సందర్శకులు హాజరై విశేష స్పందన లభించిందని తెలిపారు. పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ముగింపు కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో 2 స్థానంలో ఉండడం సంతోషం అన్నారు.

News November 28, 2025

HYD: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య

image

కుమారుడితో కలిసి కట్టుకున్న భర్తనే దారుణ హత్య చేసిందో భార్య. ఈ ఘటన మేడిపల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ దేవేంద్ర నగర్‌లో నివసించే బండారి అంజయ్య(55) స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై భార్య, కుమారుడితో నిత్యం గొడవపడేవాడు. గురువారం రాత్రి వివాదం జరగడంతో కుమారుడు, మరొకరితో కలిసి భార్య అతడిని చంపేసింది. కేసు నమోదైంది.

News November 28, 2025

HYD: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య

image

కుమారుడితో కలిసి కట్టుకున్న భర్తనే దారుణ హత్య చేసిందో భార్య. ఈ ఘటన మేడిపల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ దేవేంద్ర నగర్‌లో నివసించే బండారి అంజయ్య(55) స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై భార్య, కుమారుడితో నిత్యం గొడవపడేవాడు. గురువారం రాత్రి వివాదం జరగడంతో కుమారుడు, మరొకరితో కలిసి భార్య అతడిని చంపేసింది. కేసు నమోదైంది.