News April 10, 2025

HYD: 11 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

image

సైబరాబాద్ కమిషనరేట్‌లో 11 మంది ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమనగల్ CIగా జానకిరామ్ రెడ్డి, పేట్‌బషీరాబాద్ డీఐ సుంకరి విజయ్‌ని చందానగర్‌కు, ఆమనగల్ సీఐ ప్రమోద్ కుమార్‌ను RGIAకు, శామీర్‌పేట్ డీఐ గంగాధర్‌ను కడ్తాల్ PSకు, కడ్తాల్‌లో పనిచేస్తున్న శివప్రసాద్‌ను సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News September 8, 2025

RR: పింఛన్‌దారులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్

image

అధికారంలోకి రాగానే పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి 2 ఏళ్లు కావస్తున్నా పింఛన్ పెంచకుండా మోసం చేస్తున్నట్లు MRPS చీఫ్ మందకృష్ణ మాదిగ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు పింఛన్‌దారులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే పింఛన్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

News September 8, 2025

HYD: 3 లక్షల 3 వేల విగ్రహాల నిమజ్జనం

image

గణేష్ నిమజ్జనం విజయవంతంగా జరిగిందని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల 3 వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు GHMC, పోలీసు, విద్యుత్, హెచ్ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ, విద్యుత్, పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.

News September 7, 2025

రంగారెడ్డి: నిరుద్యోగులకు శుభవార్త

image

నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి మ. 2.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాధికారి జయశ్రీ తెలిపారు. విద్యార్హత 10th, ఇంటర్, డిగ్రీ, PG, ITI డిప్లమా. వయస్సు: 18-30 మధ్య ఉండాలి. మరిన్ని వివరాలకు 9063099306, 8977175394 నంబర్లను సంప్రదించాలన్నారు.