News February 24, 2025
HYD: 12 గంటల పాటు నిర్విరామ గానంతో రికార్డ్

గాయని ఓక్కరే సహా గాయకులు పదుల సంఖ్యలో పన్నెండు గంటల పాటు నిర్విరామ గానంతో ప్రేక్షకులచే ప్రశంపలు పొందారు. ఈ అపురూప విన్యాసానికి చిక్కడపల్లి గానసభ వేదిక అయింది. గాయని ఆనంద లక్ష్మి ఉదయం 8.05 నిమిషాలకు తన గానం ఆరంభించి రాత్రి 8.30 వరకూ నిరాటకంగా కేవలం పదిహేను నిమిషాలు వ్యవధి ఇస్తూ పన్నెండు గంటల పాటు సినిమా పాటలు, అన్నమయ్య కీర్తనలు ఆలపించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకెర్కారు.
Similar News
News December 15, 2025
క్వాయర్ యూనిట్ల అభివృద్ధికి కార్యాచరణ: కలెక్టర్

క్వాయర్ మ్యాట్ యూనిట్లను చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎంట్రికోన పర్యటనలో సర్పంచ్ శ్రీనివాస్ ఇచ్చిన వినతిపత్రంపై ఆయన సానుకూలంగా స్పందించారు. దీనివల్ల యూనిట్లపై ఆధారపడిన మహిళలకు ప్రభుత్వ రాయితీలు, ఇతర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారుల సమన్వయంతో దీనిపై విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు.
News December 15, 2025
ఏలూరు: పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు స్ఫూర్తిదాయకం- కలెక్టర్

కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రరాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం అన్నారు. మహాత్మాగాంధీ బోధించిన సత్య, అహింస, హరిజనోద్దరణ ఆశయాలు కోసం జీవితాంతం కృషి చేశారన్నారు.
News December 15, 2025
ICC ప్లేయర్స్ ఆఫ్ ది మంత్గా షెఫాలీ, హార్మర్

ఈ ఏడాది వన్డే WC ఫైనల్లో రాణించిన భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (నవంబర్) అవార్డు గెలుచుకున్నారు. ప్రతీకా రావల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన వర్మ.. ఫైనల్లో 87 రన్స్&2 వికెట్లు తీసి భారత్ గెలుపులో కీలకమయ్యారు. మరోవైపు పురుషుల విభాగంలో సౌతాఫ్రికా స్పిన్నర్ హార్మర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్నారు. టీమ్ ఇండియాతో జరిగిన రెండు టెస్టుల్లో ఆయన 17 వికెట్లు తీశారు.


