News September 15, 2024
HYD: 16న నాగపూర్-సికింద్రాబాద్ ‘వందే భారత్’ ప్రారంభం
నాగపూర్ నుంచి సికింద్రాబాద్(SEC) మార్గంలో ఈ నెల 16న వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నాగపూర్ నుంచి ఉ.5 గంటలకు బయలుదేరి మ.12:15కు SEC చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SEC నుంచి మ.1 గంటకు బయలుదేరి రా.8:20కు నాగపూర్ చేరుకుంటుంది.కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవగ్రాంలో హాల్టింగ్ ఉంటుంది.
Similar News
News September 18, 2024
HYD: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి
RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శంకర్పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మున్సిపల్ పరిధి బుల్కాపూర్ వార్డు శివారులో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. HYD నుంచి శంకర్పల్లి వైపు వస్తున్న RTC బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2024
HYD: లడ్డూ వేలం.. ఏ ప్రాంతంలో ఎంతంటే..?
✓బండ్లగూడ జాగీర్ రిచ్మండ్ విల్లాస్లో రూ.1.87 కోట్లు
✓బాలాపూర్ గణపతి రూ.30,01,000
✓కొంపల్లి అపర్ణ మెడోస్ రూ.29.10 లక్షలు
✓శంకర్పల్లి విఠలేశ్వరుడి వద్ద రూ.12.51 లక్షలు
✓అత్తాపూర్ భక్త సమాజ్ రూ.11.16 లక్షలు
✓ఉప్పరపల్లి వీరాంజనేయాలయంలో రూ.10 లక్షలు
✓చేవెళ్ల ఖానాపూర్లో రూ.6.63 లక్షలు
✓బాచుపల్లి బడా గణేశ్ రూ.6.2 లక్షలు
✓శంకర్పల్లి పర్వేదలో రూ.4 లక్షలు
మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి
News September 18, 2024
HYDలో పెద్ద ఆఫీసులకు డిమాండ్
విశాలమైన ఆఫీసులకు హైదరాబాద్లో భారీ డిమాండ్ ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. లక్ష చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో ఉన్న వాటిని లార్జ్ ఫార్మాట్ ఆఫీసులు అంటారు. ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో (హెచ్1) 3.08 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీల జాగా అమ్ముడైంది. గతేడాది మొదటి ఆర్నెళ్లలో 1.47 మిలియన్ చదరపు అడుగులు ఉంది, లావాదేవీలలో 61% వాటా ఈ సెగ్మెంట్లో ఉంది.