News August 21, 2024
HYD: 2 వేల మందితో భారీ ర్యాలీ

కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచారం ఘటనను నిరసిస్తూ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు (దాదాపు 2 వేల మంది) ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ RBనగర్ నుంచి మధురానగర్, HYD- బెంగళూరు రహదారి మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
Similar News
News December 4, 2025
గ్లోబల్ సమ్మిట్: 22 కిలో మీటర్ల మార్గంలో పోలీసుల తనిఖీలు

గ్లోబల్ సమ్మిట్ కోసం భద్రత అసాధారణ స్థాయికి చేరింది. తుక్కుగూడ నుంచి మీర్ఖాన్పేట్ వరకు ఉన్న 22KM మార్గంలో బాంబ్, డాగ్ స్క్వాడ్లు అణువణువూ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఆరు ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నవంబర్ 24 నుంచే ప్రధాన భద్రతాధికారి హై అలర్ట్ ప్రకటించి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
News December 4, 2025
HYD: కేటీఆర్ పర్యటనలో కెమెరామెన్ మృతి

కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. విడియో తీస్తుండగా గుండె నొప్పితో ఆజ్ తక్ ఛానల్ కెమెరామెన్ దామోదర్ కుప్పకూలారు. గమనించిన పోలీసులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దామోదర్ మృతి చెందారు. మృతదేహం గాంధీ మార్చరికి తరలించారు.
News December 4, 2025
HYD: త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తిమంతం: రంగారావు

త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తివంతమైందని, దేశ రక్షణలో కీలకమని నేవీ విశ్రాంత ఆఫీసర్ DP రంగారావు అన్నారు. ‘1969-80 వరకు పని చేశాను. 1971 WARలో ఉన్నాను. 1970-76లో ఒకే షిప్లో 6 ఏళ్లు 28 దేశాలు ప్రయాణించాను. 1976లో INS వీరబాహు సబ్ మెరైన్ బేస్ మెయింటెనెన్స్ మెరైన్ ఇంజినీర్గా విధులు నిర్వహించాను. సంగ్రామ్ మెడల్, పశ్చిమ స్టార్ మెడల్స్ అందుకున్నాను’ అని నేవీ డే వేళ హయత్నగర్లో ఆయన Way2Newsతో మాట్లాడారు.


