News August 21, 2024

HYD: 2 వేల మందితో భారీ ర్యాలీ

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటనను నిరసిస్తూ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు (దాదాపు 2 వేల మంది) ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ RBనగర్ నుంచి మధురానగర్, HYD- బెంగళూరు రహదారి మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

Similar News

News October 26, 2025

HYD: వారి నెత్తుటితో తడిచిన నేల స్మరిస్తోంది

image

పాషా నరహరి అంటే ఇద్దరు కాదు.. ఒక్కరిగా ప్రజలకు గుర్తు. పేదల పక్షాన పోరాడిన ఈ మహణీయులు మంచాలలోని జాపాలలో జన్మించారు. వీరు పుట్టిన ఊరు చరిత్రలో నిలిచిలా భూస్వాములతో పోరాడారు. 1989లో ఇదే రోజున ఆ వీరులను గూండాలు కాపుగాసి లింగంపల్లి గేటు వద్ద కత్తులు, గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారు. వారి నెత్తుటితో తడిచిన నేల ఇప్పటికీ వారిని స్మరించుకుంటోంది. నేడు వారి వర్ధంతికి ప్రజలు వారిని గుర్తుచేసుకుంటున్నారు.

News October 26, 2025

HYD: ప్రాణంగా ప్రేమించా.. వద్దంటోంది: సూసైడ్ నోట్

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ PS పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీలో విషాదం నెలకొంది. సూసైడ్ నోట్‌లో ‘ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా. తనవల్ల పల్సర్ బైక్ పోగొట్టుకున్నా. ఇప్పుడు నన్ను వద్దంటోంది. నాన్న I LOVE YOU మళ్లీ జన్మలో మీకు కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ నన్ను క్షమించండి’ అని రాసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 26, 2025

జూబ్లీ బైపోల్ ఆ ముగ్గురికి అగ్నిపరీక్ష

image

జూబ్లీ బైపోల్ రేవంత్, KTR, రాంచందర్‌రావుకు ప్రతిష్ఠ పోరైంది. గెలుపు, ఓటమి పనితీరుకు తీర్పు కానుంది. గెలిస్తే రేవంత్‌రెడ్డి పాలనకు రెఫరెండమ్‌గా భావించొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ KTR చూస్తున్నారు. BRS గెలిస్తే సీటీలో ఆయన ఇమేజ్ బలపడి, ఆయన నాయకత్వానికి ఈ తీర్పు సూచికవుతుంది. BJP TG చీఫ్ రాంచందర్‌రావుకు ఇదే తొలిఎలక్షన్. బోణి కొడితే ఆయన నాయకత్వంపై అందరిలో స్పష్టత వస్తుంది.