News May 19, 2024
HYD: 2.18 కోట్ల మంది ఓటర్లు ఓటేశారు!
గత 2019 లోక్సభ ఎన్నికల్లో 1.86 కోట్ల మంది ఓటేశారని, ఈసారి తెలంగాణ -2024 లోక్సభ ఎన్నికల్లో 2.18 కోట్ల మంది ఓటర్లు ఓటేసినట్లుగా CEO వికాస్ రాజ్ తెలిపారు. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగినందుకు రాష్ట్ర ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా మల్కాజ్గిరిలో 50.78, చేవెళ్లలో 56.50, HYD 48.48, సికింద్రాబాద్లో 49.04 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు.
Similar News
News October 4, 2024
HYD: నేడు హైకోర్టులో వైద్య శిబిరం
నిర్మాణ్ సంస్థ, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ఈరోజు హైకోర్టులో మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డా.రాకేశ్ సహాయ్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు.
News October 4, 2024
దసరా పండుగకు 6000 ప్రత్యేక బస్సులు
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్ళే ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా TGRTC 6000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని కూకట్పల్లి ఆర్టీసీ డిపో డీఎం హరి తెలిపారు. రద్దీకి అనుగుణంగా జగద్గిరిగుట్ట, కూకట్పల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, వరంగల్, MBNR, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, కర్నూల్, అనంతపురం ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు డీఎం స్పష్టం చేశారు.
News October 4, 2024
గోవా వెళ్తున్నారా..? సికింద్రాబాద్ నుంచి 2 ట్రైన్లు
సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య నడుస్తాయి. సికింద్రాబాద్- వాస్కోడగామా రైలు (17039/17040) బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి నడుస్తుంది.