News August 28, 2024
HYD: 20 పార్కుల ఏర్పాటుకు HMDA ప్రణాళిక

HYD నగర శివారులో ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు 20 పార్కులకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కొత్వాల్ గూడలో 105 ఎకరాల్లో పురోగతిలో ఉండగా, ఇక శంషాబాద్, తెల్లాపూర్, గాజులరామారం లోనూ ఏర్పాటు చేయనున్నారు. ఆయా పార్కులలో సకల వసతులు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పిల్లలకు ఆట సామాగ్రితో పాటు, ఇతరత్ర అందుబాటులో ఉంచనున్నారు.
Similar News
News April 14, 2026
రంగారెడ్డిలో 40 దాటింది.. జాగ్రత్త!

రంగారెడ్డిలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి దండుమైలారంలో గరిష్ఠంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్గుల్, ఎలిమినేడు ప్రాంతాల్లో 41.7 డిగ్రీలు, బోడకొండ, రాచులూరు ప్రాంతాల్లో 41.6 డిగ్రీలు నమోదయ్యాయి. యాచారం, మొయినాబాద్, కడ్తాల్ ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచించారు.
SHARE IT
News April 12, 2026
ఇంటర్ సెకండియర్లో RRకు 5TH ర్యాంక్

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. RR(D)లో రెగ్యులర్ విద్యార్థులు 74723 మంది పరీక్షలు రాయగా 60981 మంది పాసై 81.61 శాతంతో స్టేట్లోనే 5th ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్లో 3042మందికి 2279 మంది పాసై 74.92%తో 15వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్లో 7,246మందికి 2106 మంది పాసై 29.06%తో 26వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్లో 223 మందికి 115 మంది పాసై 51.57%తో 17వ ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ 1st ఇయర్ ఫలితాల్లో RRకి 2nd ర్యాంక్

ఇంటర్ 1st ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో రెగ్యులర్ 1st ఇయర్ విద్యార్థులు 80,096 మంది పరీక్షలు రాయగా 61,177 మంది పాసై 76.38 శాతంతో స్టేట్లోనే సెకండ్ ర్యాంక్లో నిలిపారు. ఇక ఒకేషన్లో 3,946 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,438 మంది విద్యార్థులు పాసవ్వడంతో 61.78 శాతంతో స్టేట్లో 16వ స్థానంలో నిలిచింది.


