News August 24, 2024

HYD: 20 మంది మాయగాళ్లు.. 900 కేసులు

image

పార్ట్ టైం జాబ్స్, షేర్ మార్కెట్, ఫెడెక్స్ కొరియర్‌తో బెదిరింపులు.. ఇలా గుజరాత్ ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయి. తరచూ చిరునామా మార్చుతూ పోలీసులను ఏమార్చటం వీరి ప్రత్యేకత. సైబర్ క్రైమ్ పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి గుజరాత్‌లో మకాం వేసి నేరస్థులను గుర్తించారు. 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిపై మన రాష్ట్రంలోనే 100కు పైగా కేసులు ఉన్నాయని తెలుస్తోంది. 

Similar News

News January 8, 2026

HYDలో ఇళ్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్

image

ఇల్లు కట్టుకున్నాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేక కరెంట్, నీళ్ల కనెక్షన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా? ఇక ఆ కష్టాలకు చెక్! పర్మిషన్ గడువు ముగిసినా, ప్లాన్ ప్రకారమే కట్టిన నాన్ హైరైజ్ భవనాలకు ఓసీ ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గడువు దాటిన రెండేళ్లలోపు అప్లై చేస్తే పాత ఫీజులే, ఆ పైన అయితే కొత్త రేట్ల ప్రకారం ఛార్జీలు కట్టి సర్టిఫికెట్ పొందవచ్చు.
SHARE IT

News January 8, 2026

IT కారిడార్‌లో అర్ధరాత్రి బేఫికర్!

image

ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చే టెక్కీలైనా, రాత్రివేళ నడిచే సామాన్యులైనా చీకటి గల్లీల్లో అడుగు వేయాలంటే భయం. ఈ భయాన్ని పోగొట్టడానికే శేరిలింగంపల్లిలో రూ.50 కోట్లతో జీహెచ్‌ఎంసీ కొత్త వెలుగులు నింపుతోంది. కేవలం లైట్లు వేయడమే కాదు.. అవి ఐదేళ్ల పాటు వెలిగేలా గ్యారెంటీ బాధ్యత కూడా కాంట్రాక్టరుదేనని అధికారులు తెలిపారు. దీంతో మన రోడ్లపై రాత్రిపూట కూడా సురక్షితంగా, ధీమాగా తిరిగే భరోసా లభిస్తుంది.

News January 8, 2026

కాచిగూడలో హిందూ- ముస్లిం లవ్ మ్యారేజ్

image

నగరంలో అంతర్మత వివాహం చట్టబద్ధంగా నమోదైంది. హిందూ–ముస్లిం యువతి యువకుల మధ్య జరిగిన ఈ వివాహాన్ని కాచిగూడ PSలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేశారు. మేజర్ల సమ్మతితో, అన్ని చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ వివాహ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.